AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబు నాయుడు ఎప్పుడూ నిజం చెప్పలేరు: సుచరిత

బాధితుల వ్యధలు వింటుంటే.. గత ప్రభుత్వం ఎలా  పాలన సాగించిందో అర్థమవుతోందని అన్నారు హెంమంత్రి సుచరిత. మీడియాతో మాట్లాడిన ఆమె మాజీ సీఎం చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేశారు. ఏపీ జరిగిన అక్రమ మైనింగ్ మరెక్కడా జరగలేదని అన్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ నిజం చెప్పలేదని.. ఆయన హయాంలో అక్రమాలు చేసి.. ఇప్పుడు నీతులు చెప్తున్నారని విమర్శించారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం చంద్రబాబుగారికి ఇష్టం లేదని అన్నారు. ప్రజల సంక్షేమం దిశగా జగన్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు […]

చంద్రబాబు నాయుడు ఎప్పుడూ నిజం చెప్పలేరు: సుచరిత
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 07, 2019 | 9:03 PM

Share

బాధితుల వ్యధలు వింటుంటే.. గత ప్రభుత్వం ఎలా  పాలన సాగించిందో అర్థమవుతోందని అన్నారు హెంమంత్రి సుచరిత. మీడియాతో మాట్లాడిన ఆమె మాజీ సీఎం చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేశారు. ఏపీ జరిగిన అక్రమ మైనింగ్ మరెక్కడా జరగలేదని అన్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ నిజం చెప్పలేదని.. ఆయన హయాంలో అక్రమాలు చేసి.. ఇప్పుడు నీతులు చెప్తున్నారని విమర్శించారు.

రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం చంద్రబాబుగారికి ఇష్టం లేదని అన్నారు. ప్రజల సంక్షేమం దిశగా జగన్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని.. ఇవి చూసి ఓర్వలేకనే చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్ట్‌లతో ఏదో జరిగిపోతోందని ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆయన మతి భ్రమించి మాట్లాడుతున్నారని.. ప్రజలను రెచ్చగొట్టే ధోరణి వదులుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పారదర్శక పాలన ఉండాలని జగన్ భావిస్తున్నారని సుచరిత పేర్కొన్నారు.