గోరంట్ల మాధవ్కు హైకోర్టులో ఊరట
అనంతపురం: హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోరంట్ల మాధవ్కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. గోరంట్ల మాధవ్ నామినేషన్ వేసుకోవచ్చని హైకోర్టు తీర్పు వెలువరించింది. మాధవ్ వ్యవహారంలో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. కాగా మాధవ్పై మెమోలు ఉన్నాయని.. వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వడం కుదరదంటూ ఏపీ ప్రభుత్వం వేసిన స్టే పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. అయితే, ఇప్పటికే హిందూపురం నుంచి మాధవ్ నామినేషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పుతో ఆయన ఎన్నికల […]
అనంతపురం: హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోరంట్ల మాధవ్కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. గోరంట్ల మాధవ్ నామినేషన్ వేసుకోవచ్చని హైకోర్టు తీర్పు వెలువరించింది. మాధవ్ వ్యవహారంలో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. కాగా మాధవ్పై మెమోలు ఉన్నాయని.. వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వడం కుదరదంటూ ఏపీ ప్రభుత్వం వేసిన స్టే పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. అయితే, ఇప్పటికే హిందూపురం నుంచి మాధవ్ నామినేషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పుతో ఆయన ఎన్నికల బరిలో దిగడం ఖాయమైంది.