Telugu News » Political images » Four resignations why does bs yediyurappa never complete a full term as karnataka cm
BS Yediyurappa: నాలుగు సార్లు ముఖ్యమంత్రి.. అయినా వరుసగా ఐదేళ్ల పాటు పదవిని పూర్తి చేయని యెడ్డీ!
Balaraju Goud |
Updated on: Jul 26, 2021 | 10:36 PM
కర్ణాటక బీజేపీ సీనియర్ నేత, పార్టీకి ఎంతో నమ్మకస్తుడైన బీఎస్ యెడియూరప్ప సీఎం పదవిని నాలుగుసార్లు చేపట్టారు. అయితే ఏ ఒక్కసారి కూడా పూర్తి కాలం ముఖ్యమంత్రి పదవిలో ఆయన కొనసాగలేదు.
Jul 26, 2021 | 10:36 PM
గద్దె దిగిన కర్నాటక సీఎం యడియూరప్ప మరోసారి కన్నీరుమున్నీరయ్యారు. రాజీనామాపై ప్రకటన చేస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు యెడ్డీ. సైకిల్ తొక్కి కర్నాటకలో బీజేపీని అధికారం లోకి తీసుకొచ్చినట్టు కీలకవ్యాఖ్యలు చేశారు యడియూరప్ప. 50 ఏళ్ల పాటు పార్టీని పటిష్టం చేసేందుకు బీజేపీ అగ్రనేతలు వాజ్పేయి, అద్వానీ, మురళీమనోహన్జోషితో కలిసి కృషి చేసినట్టు తెలిపారు.
1 / 9
యడియూరప్ప రాజీనామాను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. యడియూరప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న షికారిపురలో నిరసనలు వెలువెత్తాయి. యడియూరప్పను ఒక్కసారి కూడా ఐదేళ్ల పాటు పదవీకాలం పూర్తి చేయకుండా కుట్రలు చేశారని అభిమానులు నినాదాలు చేశారు. షికారిపురలో వ్యాపారులు స్వచ్చంధంగా బంద్ పాటిస్తున్నారు.
2 / 9
కర్ణాటక బీజేపీ సీనియర్ నేత, పార్టీకి ఎంతో నమ్మకస్తుడైన బీఎస్ యెడియూరప్ప సీఎం పదవిని నాలుగుసార్లు చేపట్టారు. అయితే ఏ ఒక్కసారి కూడా పూర్తి కాలం ముఖ్యమంత్రి పదవిలో ఆయన కొనసాగలేదు. యడియూరప్ప సీఎం పదవికి నాలుగుసార్లు రాజీనామా చేయడానికి దారితీసిన కారణాలను పరిశీలిస్తే.. 2007లో.. ఎనిమిది రోజులు సీఎంగా యెడ్డీ.. 2006 జనవరిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి జేడీ(ఎస్) తన మద్దతు ఉపసంహరించింది. ఆ ప్రభుత్వం కూలిపోవడంతో జేడీ(ఎస్), బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
3 / 9
2008 నుంచి సీఎం పదవిలో మూడున్నర ఏళ్లు సీఎంగా పని చేశారు యడియూరప్ప. 2008 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో 2008 మే 30న యడియూరప్ప రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అక్రమ మైనింగ్ వ్యవహారంలో యడియూరప్ప పాత్రపై కర్ణాటక లోకాయుక్తా దర్యాప్తు జరిపి 2011లో నివేదిక సమర్పించింది. దీంతో బీజేపీ అధిష్ఠానం నుంచి ఆయనపై ఒత్తిడి రావడంతో మూడున్న ఏండ్ల పాలన తర్వాత 2011 జూలై 31న సీఎం పదవికి రాజీనామా చేశారు.
4 / 9
2018లో సీఎంగా రెండున్నర రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా యడియూరప్ప కొనసాగారు. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన 112 సీట్లు రాలేదు. అయితే, 104 స్థానాల్లో గెలిచిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. దీంతో 2018 మే 17న యడియూరప్ప సీఎంగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. 2018 మే 19న అసెంబ్లీలో విశ్వాసపరీక్షలో మెజార్టీ లేకపోవడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. కేవలం రెండున్నర రోజలు సీఎంగా ఉన్న వ్యక్తిగా యెడ్డీ రికార్డుకెక్కారు.
5 / 9
2019 నుంచి సీఎంగా రెండేళ్ల పాటు కొనసాగారు. 2018లో యడియూరప్ప రాజీనామా అనంతరం 80 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్, 36 స్థానాల్లో గెలిచిన జేడీఎస్ కలిసి కుమారస్వామి సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఏడాది తర్వాత కాంగ్రెస్, జేడీఎస్కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలను బీజేపీ ఆకట్టుకుంది. దీంతో వారు శాసనసభ్యత్వానికి రాజీనామాలు సమర్పించి బీజేపీలో చేరారు. దీంతో 2019 జూలై 23న జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని గవర్నర్ ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో 2019 జూలై 26న యెడియూరప్ప నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.
6 / 9
2019 జూలై 23న జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని గవర్నర్ ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో 2019 జూలై 26న యెడియూరప్ప నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.
7 / 9
ఏడాది తర్వాత సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి అసంతృప్తిని ఆయన ఎదుర్కొన్నారు. ఆయనను సీఎం పదవి నుంచి తొలగించాలని అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో 2021 జూన్ నుంచి సీఎం మార్పుపై ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో రెండేండ్లుగా సీఎంగా ఉన్న యడియూరప్ప, గత నెల రోజులుగా సీఎం మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చుతూ వచ్చారు. ఇటీవల ప్రధాని మోదీతో భేటీ అనంతరం చివరకు సోమవారం 2021 జూలై 26న సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారు.