uppula Raju |
Updated on: Jan 30, 2022 | 3:14 PM
ప్రపంచం నలుమూలల నుంచి శాస్త్రవేత్తలు భూమి కాకుండా మరే ఇతర గ్రహం మీద జీవం సాధ్యమేనా అని శోధిస్తున్నారు. వీటిలో అంగారకుడి పేరు ముందుంటుంది. సుమారు 3 బిలియన్ సంవత్సరాల క్రితం అంగారకుడిపై నీరు ప్రవహించేదని అప్పటి నుంచి కరువు ఏర్పడిందని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. అయితే తాజాగా దానికి సంబంధించిన కొత్త సమాచారం అందింది.
స్పేస్ అనే వెబ్సైట్ ప్రకారం.. నాసా మార్స్ రికనైసెన్స్ ఆర్బిటర్ ఇచ్చిన కొత్త సమాచారం ప్రకారం.. సుమారు 2 బిలియన్ సంవత్సరాల క్రితం అంగారకుడిపై నీరు ఉంది. భూమిలాగే నీటి ప్రవాహం కూడా ఉండేది. ఇది చాలా ఆసక్తికరమైన సమాచారం.
వాస్తవానికి NASA మార్స్ రికనైసెన్స్ ఆర్బిటర్ 2006 నుంచి అంగారకుడి చుట్టూ తిరుగుతోంది. ఎప్పటికప్పుడు ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తోంది. ఈ ఆర్బిటర్ చాలా సంవత్సరాలుగా రెడ్ ప్లానెట్పై నీటి అవకాశం కోసం వెతుకుతోంది.
సుమారు 14 సంవత్సరాల క్రితం NASA మార్స్ ఒడిస్సీ ఆర్బిటర్ అంగారక గ్రహంపై ఉప్పు ఖనిజాల ఉనికిని కనుగొంది. ఈ గ్రహం మీద జీవం ఉనికికి శాస్త్రవేత్తలకు కొత్త సాక్ష్యాలను అందించింది.
అంగారక గ్రహంపై మానవులను స్థిరపరిచేందుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. రాబోయే 30 నుంచి 40 సంవత్సరాలలో మానవులు ఈ గ్రహం మీద జీవించడం ప్రారంభిస్తారని అంచనా.