- Telugu News Photo Gallery Turmeric Side Effects: Are You Taking Too Much Turmeric? Side Effects You Should Know
Side Effects of Turmeric: రోజుకు ఎంత మొత్తంలో పసుపు తీసుకోవాలో తెలుసా? అతిగా తిన్నారంటే..
పసుపును 'సూపర్ ఫుడ్' అని అంటారు. చిటికెడు పసుపు పొడి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పసుపు జలుబు నుంచి, ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడి, వాపు తగ్గిస్తుంది. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడంలోనూ సహాయపడుతుంది..
Updated on: Nov 08, 2023 | 9:35 PM

పసుపులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని సహజమైన మార్గంలో నిర్విషీకరణ చేస్తాయి. ఇది జీవక్రియ, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. రోజువారీ ఆహారంలో పసుపును ఈ కింది మార్గాల్లో చేర్చుకోవచ్చు. పాలల్లో పసుపు పొడి కలుపుకుని తాగొచ్చు. పసుపు పాలలోని పోషకాలు శరీరానికి అందేలా చేస్తుంది. అంతేకాకుండా, పసుపు-పాలు శరీరం నుంచి హానికారక విషాలను తొలగిస్తుంది. పాలు మరిగేటప్పుడు చిటికెడు పసుపు, మిరియాల పొడి వేసుకోవాలి. తాగేటప్పుడు స్పూన్ తేనె కలుపుకుంటే సరిపోతుంది.

అయితే కేవలం నీళ్లు మాత్రమే తాగితే ప్రయోజనం ఉండదు. శరీర ర్విషీకరణ చేయడానికి నీళ్లలో కొన్ని సుగంధ ద్రవ్యాలను కూడా కలుపుకోవచ్చు. శరీరంలో పేరుకుపోయిన కాలుష్య కారకాలను తొలగించడానికి పసుపు సహాయపడుతుంది. పసుపులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే శరీరం నుంచి హానికారక విషాలను బయటికి పంపుతుంది.

పసుపు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటి నుంచీ అధికమొత్తంలో తింటే ఆరోగ్యానికి హాని తలపెడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు 500-2000 మి.గ్రా పసుపు తీసుకుంటే శరీరానిక అవసరమైన కర్కుమినాయిడ్స్ అందుతాయని అంటున్నారు.

గతితప్పిన వేళల్లో ఆహారం తినడం, తాగడం వల్ల కొలెస్ట్రాల్, మధుమేహం వంటి వ్యాధులు వస్తాయి. దాంతో పాటు శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. అంతేకాకుండా, గ్యాస్-గుండె మంట సమస్య తరచుగా వేధిస్తుంది. ఈ వ్యాధుల నుంచి బయటపడటానికి శరీరాన్ని నిర్విషీకరణ చేయడం చాలా ముఖ్యం. శరీరంలో పేరుకుపోయిన కాలుష్య కారకాలను బయటకు పంపాలంటే.. ఉదయం పూట ఖాళీ కడుపుతో నీళ్లు త్రాగడం చాలా అవసరం. ఇది మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. అలాగే శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

ప్రతి రాత్రి పసుపు కలిపి ఒక గ్లాసు పాలు తాగడం వల్ల శారీరక మంట తగ్గుతుంది. హాయిగా నిద్ర పడుతుంది. ఈ పాలల్లో బెల్లం కలిపి తాగితే జలుబు, శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.





























