Tirumala: నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజున ఏ వాహన సేవలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారంటే..
తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కలియుగ వైకుంఠాన్ని తలపించే తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. స్వామివారిని దర్శించుకుని తరిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. ఈ రోజు నుంచి మొదలైన బ్రహ్మోత్సవాలలో స్వామివారి ఏ రోజున ఏ వాహన సేవలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారో తెలుసుకుందాం
Most Read Stories