Tribal Festival: ఇంద్రదేవికి తొలి పూజ.. నాగోబా జాతరకు అంకురార్పణ.. కెస్లాపూర్కు కదిలిన మేస్రం సైన్యం
అడవుల జిల్లా ఆదిలాబాద్ మేస్రం వంశీయుల మహా పూజలతో పులకించి పోతోంది. ప్రకృతినే మహా దైవ్యంగా పూజించే ఆదివాసీల మహా జాతరకు వేళయింది. చెట్టును , పుట్టను , మట్టిని , మానును , జలాన్ని భక్తిశ్రద్దలతో మొక్కే జాతర నాగోబాకు అంకురార్పణ జరగబోతోంది. నాగోరే నాగోబా అంటూ కెస్లాపూర్ నుండి హస్తినమడుగుకు కదిలిన మేస్రం వంశీయులు గంగాజలాన్ని సేకరించి ప్రధాన పూజకు ఆనతినియ్యమంటూ ఆది దేవత ఇంద్రాదేవి చెంతకు చేరింది మేస్రం సమాజం. ఆచార సంప్రదాయాల ప్రకారం గంగాజలంతో ఇంద్రవెళ్లి లోని ఇంద్రదేవి ఆలయానికి చేరుకున్న మేస్రం వంశీయులు. ఆలయ ఆవరణలోని మర్రి చెట్టుపై గంగాజల ఝరిని ( కలశాన్ని ) ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
Follow Us
