AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Curse Of Talakadu : మైసూరు రాజు నగలపై మోజు .. అలమేలు శాపంతో ఈ ప్రాంతం ఇసుక దిబ్బగా మారిన వైనం..

మన దేశంలో హిందూ ధర్మంలో ఆడవారిని ఏడిపించరాదని.. వారి శాపం పాపంగా తగిలి రాజులు పోయారని.. రాజ్యాలు కనుమరుగై పోయాయని ఓ నమ్మకం.. ఆ నమ్మకానికి సజీవ సాక్ష్యంగా నేటికీ నిలుస్తుంది తలకాడు పట్టణం. ఈ ప్రదేశం క్రీ.శ. 16 వ శతాబ్దానికి ముందు ఎంతో ఆకర్షణీయ ప్రదేశంగా ఉండేది. సుమారుగా 30 పైచిలుకు ఆలయాలు ఉండేవి. ఓ రాజు అత్యాశ ఫలితంగా ఓ మహారాణి ఇచ్చిన శాపంతో తలకాదు ఇసుక దిబ్బగా మారిపోయింది.

Surya Kala
|

Updated on: Mar 17, 2021 | 6:25 PM

Share
తలకాడు ప్రాంతం ఒకప్పుడు ఎంతో ఆకర్షణీయంగా ఉండేది. ఇక్కడ 30 కి పైగా దేవాలయాలుండేవి.వాటిల్లో ఐదు ప్రఖ్యాత శివాలయాలు కూడా ఉన్నాయి. అయితే ఈ పట్టణం 16వ శతాబ్దంలో ఇసుక తిన్నెలతో కప్పబడింది. మైసూర్ ఒడయార్ల పాలనలో ఈ ప్రదేశం నాశనం చెందిందని చరిత్రకారుల అభిప్రాయం. అయితే ఈ ప్రాంతం ఇలా ఇసుక దిబ్బగా మారిపోవడానికి అనేక స్ధానిక కధనాలు, ఊహాగానాలు  వినిపిస్తూనే ఉన్నాయి.

తలకాడు ప్రాంతం ఒకప్పుడు ఎంతో ఆకర్షణీయంగా ఉండేది. ఇక్కడ 30 కి పైగా దేవాలయాలుండేవి.వాటిల్లో ఐదు ప్రఖ్యాత శివాలయాలు కూడా ఉన్నాయి. అయితే ఈ పట్టణం 16వ శతాబ్దంలో ఇసుక తిన్నెలతో కప్పబడింది. మైసూర్ ఒడయార్ల పాలనలో ఈ ప్రదేశం నాశనం చెందిందని చరిత్రకారుల అభిప్రాయం. అయితే ఈ ప్రాంతం ఇలా ఇసుక దిబ్బగా మారిపోవడానికి అనేక స్ధానిక కధనాలు, ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి.

1 / 6
 తలకాడు ప్రారంభంలో గంగ వంశస్థులు, ఆ తర్వాత చోళులు పరిపాలించారు. చోళులను ఓడించి హోయసుల రాజు విష్ణు వర్ధనుడు రాజ్యాధికారం చేపట్టి పరిపాలన చేపట్టాడు.. తర్వాత విజయనగర రాజులు కూడా ఈ ప్రాంతాన్ని పాలించారు. అయితే ఈ ప్రాంత దేవత అయిన ఆలమేరు అమ్మవారి నగలపై కన్నేసిన మైసూర్ రాజు తలకాడు పై తన సైన్యంతో దాడి చేశాడని .. అమ్మవారు నగలతో పాటు కావేరి నదిలో వేసి మునిపోతూ తలకాడును ఇసుక దిబ్బలా మారిపోవాలని, మైసూర్ రాజులకు వారసుడు లేకుండా పోతాడని శపించిందని స్థానిక కధనం.

తలకాడు ప్రారంభంలో గంగ వంశస్థులు, ఆ తర్వాత చోళులు పరిపాలించారు. చోళులను ఓడించి హోయసుల రాజు విష్ణు వర్ధనుడు రాజ్యాధికారం చేపట్టి పరిపాలన చేపట్టాడు.. తర్వాత విజయనగర రాజులు కూడా ఈ ప్రాంతాన్ని పాలించారు. అయితే ఈ ప్రాంత దేవత అయిన ఆలమేరు అమ్మవారి నగలపై కన్నేసిన మైసూర్ రాజు తలకాడు పై తన సైన్యంతో దాడి చేశాడని .. అమ్మవారు నగలతో పాటు కావేరి నదిలో వేసి మునిపోతూ తలకాడును ఇసుక దిబ్బలా మారిపోవాలని, మైసూర్ రాజులకు వారసుడు లేకుండా పోతాడని శపించిందని స్థానిక కధనం.

2 / 6
 మరొక కథనంలో శ్రీ రంగరాయ భార్య రాణి అలమేలు నగలపై కన్నేసిన మైసూరు రాజు రాజాఒడయార్ తలకాడుపై తన సైన్యంతో దాడిచేస్తాడు.  అది చూసిన రాణి అలివేలు కి పట్టరాని ఆవేశం వచ్చింది. అటు భర్తనీ, ఇటు రాజ్యాన్నీ దక్కించుకోలేని దైన్యంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.   అయితే తాను మరణించే ముందు తలకాడు ఇసుక దిబ్బగానూ, మాలంగి ఒక సరస్సుగాను, మైసూరు రాజులు వారసులు లేకుండా పోతారని తన దుగ్ధనంతా ఒక శాపంగా మార్చిందని స్తానికులు చెబుతారు.

మరొక కథనంలో శ్రీ రంగరాయ భార్య రాణి అలమేలు నగలపై కన్నేసిన మైసూరు రాజు రాజాఒడయార్ తలకాడుపై తన సైన్యంతో దాడిచేస్తాడు. అది చూసిన రాణి అలివేలు కి పట్టరాని ఆవేశం వచ్చింది. అటు భర్తనీ, ఇటు రాజ్యాన్నీ దక్కించుకోలేని దైన్యంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తాను మరణించే ముందు తలకాడు ఇసుక దిబ్బగానూ, మాలంగి ఒక సరస్సుగాను, మైసూరు రాజులు వారసులు లేకుండా పోతారని తన దుగ్ధనంతా ఒక శాపంగా మార్చిందని స్తానికులు చెబుతారు.

3 / 6
 ఈ పట్టణంలో ఐదు దేవాలయాలకు ప్రసిద్ధి.  అవి వైద్యనాధేశ్వర, పాతాళేశ్వర, మరుళేశ్వర, అరకేశ్వర మరియు మల్లిఖార్జుల దేవాలయాలు. అయితే ఈ ఆలయాలు ఏడాదికేడాది ఇసుకలోకి వెళ్లిపోతున్నాయి. వీటిని రక్షించటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలోనే విష్ణు భగవానుడి ఆలయం కీర్తినాధేశ్వర పేరుతో భక్తులతో పూజలను అందుకుంటున్నాడు.

ఈ పట్టణంలో ఐదు దేవాలయాలకు ప్రసిద్ధి. అవి వైద్యనాధేశ్వర, పాతాళేశ్వర, మరుళేశ్వర, అరకేశ్వర మరియు మల్లిఖార్జుల దేవాలయాలు. అయితే ఈ ఆలయాలు ఏడాదికేడాది ఇసుకలోకి వెళ్లిపోతున్నాయి. వీటిని రక్షించటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలోనే విష్ణు భగవానుడి ఆలయం కీర్తినాధేశ్వర పేరుతో భక్తులతో పూజలను అందుకుంటున్నాడు.

4 / 6
 తలకాదు సంస్కృతికి వారసత్వంగా నిలుస్తుంది. 12 సంవత్సరాలకు ఒక సారి వచ్చే పంచలింగ దర్శనం ఇక్కడ ప్రసిద్ధి. ఈ పంచలింగ దర్శనం కార్తీక పౌర్ణమి రోజున రెండు నక్షత్రాలు ఖుహ యోగ మరియు విశాఖ కలసినపుడు ఏర్పడుతుంది.

తలకాదు సంస్కృతికి వారసత్వంగా నిలుస్తుంది. 12 సంవత్సరాలకు ఒక సారి వచ్చే పంచలింగ దర్శనం ఇక్కడ ప్రసిద్ధి. ఈ పంచలింగ దర్శనం కార్తీక పౌర్ణమి రోజున రెండు నక్షత్రాలు ఖుహ యోగ మరియు విశాఖ కలసినపుడు ఏర్పడుతుంది.

5 / 6
ఎవరైనా ఈ తలకాడును సందర్శించాలంటే ముందుగా అక్కడ వేడిని తట్టుకోవాల్సి ఉంది. అందుకనే ఈ ప్రాంత సందర్శనానికి నవంబర్  నుంచి మార్చి అనుకూలంగా ఉంటుంది. మైసూర్ కు 43 కి.మీ. దూరంలో బెంగుళూరు నుండి 120 కిలో మీటర్ల దూరంలో ఉంది తలకాదు. ఈ రెండు ప్రధాన నగరాలు, పర్యాటకులకు రవాణా సౌకర్యాలు ఉన్నాయి.

ఎవరైనా ఈ తలకాడును సందర్శించాలంటే ముందుగా అక్కడ వేడిని తట్టుకోవాల్సి ఉంది. అందుకనే ఈ ప్రాంత సందర్శనానికి నవంబర్ నుంచి మార్చి అనుకూలంగా ఉంటుంది. మైసూర్ కు 43 కి.మీ. దూరంలో బెంగుళూరు నుండి 120 కిలో మీటర్ల దూరంలో ఉంది తలకాదు. ఈ రెండు ప్రధాన నగరాలు, పర్యాటకులకు రవాణా సౌకర్యాలు ఉన్నాయి.

6 / 6