Shiv Temple: సైన్స్‌కు సవాల్ ఈ ఆలయం.. మరణించిన వారిని బతికించే ఆలయం.. నీటితో అభిషేకం చేస్తే అద్దంలా మారే శివయ్య

ప్రపంచంలో మనిషి అంబరాన్ని అందుకున్నా.. సముద్ర లోతులు కొలిచినా.. శాస్త్ర, సాంకేతికత ఎంతగా అందుబాటులోకి వచ్చినా మానవ మేదస్సుకు అందని ఎన్నో విషయాలు ఈ విశ్వంలో ఉన్నాయి. ముఖ్యంగా జీవి జనన , మరణాల గురించి ఎవరూ చెప్పలేరు అన్న సంగతి .తెలిసిందే. మన దేశంలో అనేక వింతలు విశేషాలు రహస్యాలను దాచుకున్న ఆలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో కొన్ని ఆలయాలు నేటి సైన్స్ కు సవాల్ విసురుతూనే ఉన్నాయి. అలాంటి ఒక ఆలయం.. చనిపోయిన వారిని తిరిగి బతికించగలిగే దేవాలయం. అదే లఖమండల్ లోని దేవాలయం. ఇక్కడ మరణించిన వారు కొద్దిసేపు బతుకుతారు. 

|

Updated on: May 31, 2023 | 1:25 PM

దేవతలు నివసించే రాష్ట్రంగా పేరొందిన ఉత్తరాఖండ్ లోని డెహ్రడూన్ జిల్లాలో చౌన్సర్ బావర్ అనే ప్రదేశంలో ఈ దేవాలయం ఉంది. లఖమండల్ దేవాలయం చక్రతా నుంచి దాదాపు 107 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది.  ఆలయ ప్రధాన ద్వారం వద్ద పశ్చిమం వైపున ఉన్న రెండు భవనాలు (ద్వారపాలకులు) ఉన్నాయి. ఎవరైనా చివరి ఘడియల్లో ఉన్నప్పుడు లేదా చనిపోయిన వెంటనే.. వారిని ఈ రెండు విగ్రహాల ముందుకు తీసుకువస్తారు

దేవతలు నివసించే రాష్ట్రంగా పేరొందిన ఉత్తరాఖండ్ లోని డెహ్రడూన్ జిల్లాలో చౌన్సర్ బావర్ అనే ప్రదేశంలో ఈ దేవాలయం ఉంది. లఖమండల్ దేవాలయం చక్రతా నుంచి దాదాపు 107 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది.  ఆలయ ప్రధాన ద్వారం వద్ద పశ్చిమం వైపున ఉన్న రెండు భవనాలు (ద్వారపాలకులు) ఉన్నాయి. ఎవరైనా చివరి ఘడియల్లో ఉన్నప్పుడు లేదా చనిపోయిన వెంటనే.. వారిని ఈ రెండు విగ్రహాల ముందుకు తీసుకువస్తారు

1 / 7

మృతదేహాన్ని ఉంచి, ఆలయ పూజారి శివలింగాన్ని అభిషేకించిన నీటిని తెచ్చి ఆ చివరి ఘడియల్లో ఉన్న వారి శరీరంపై చల్లితే, లేదా చనిపోయిన వ్యక్తి నోట్లో పోస్తే నిమిషాలకే తిరిగి జీవిస్తాడని ఇక్కడి స్థానికులు బలంగా నమ్ముతారు. ఇందుకు ఎన్నో ప్రత్యక్ష ఉదాహరణలు చూపిస్తారు.

మృతదేహాన్ని ఉంచి, ఆలయ పూజారి శివలింగాన్ని అభిషేకించిన నీటిని తెచ్చి ఆ చివరి ఘడియల్లో ఉన్న వారి శరీరంపై చల్లితే, లేదా చనిపోయిన వ్యక్తి నోట్లో పోస్తే నిమిషాలకే తిరిగి జీవిస్తాడని ఇక్కడి స్థానికులు బలంగా నమ్ముతారు. ఇందుకు ఎన్నో ప్రత్యక్ష ఉదాహరణలు చూపిస్తారు.

2 / 7
చనిపోయిన వ్యక్తి, తిరిగి బ్రతికిన తర్వాత శివయ్య పేరుని స్మరిస్తూ.. గంగాజలాన్ని సేవిస్తారు. గంగాజలం సేవించిన తర్వాత.. ఆత్మ మళ్లీ శరీరాన్ని విడిచిపెడుతుంది. ఈ విధంగా చనిపోయిన వ్యక్తి శాశ్వతత్వాన్ని పొందుతాడని విశ్వాసం అంతేకాదు ఈ దేవాలయ సందర్శనం వల్ల దురదృష్టం పోయి అదృష్టం వరిస్తుందని చెబుతారు.

చనిపోయిన వ్యక్తి, తిరిగి బ్రతికిన తర్వాత శివయ్య పేరుని స్మరిస్తూ.. గంగాజలాన్ని సేవిస్తారు. గంగాజలం సేవించిన తర్వాత.. ఆత్మ మళ్లీ శరీరాన్ని విడిచిపెడుతుంది. ఈ విధంగా చనిపోయిన వ్యక్తి శాశ్వతత్వాన్ని పొందుతాడని విశ్వాసం అంతేకాదు ఈ దేవాలయ సందర్శనం వల్ల దురదృష్టం పోయి అదృష్టం వరిస్తుందని చెబుతారు.

3 / 7
ఈ దేవాలయం ప్రవేశ ద్వారం వద్ద మానవ, దానవ అనే రెండు ఎత్తైన విగ్రహాలున్నాయి. వీటిని స్థానికులు  భీమార్జునులదని చెబుతారు. మరికొందరు విష్ణువు నివశించే వైకుంఠం ద్వారపాలకులైన జయ విజేయులని కూడా అంటారు. 

ఈ దేవాలయం ప్రవేశ ద్వారం వద్ద మానవ, దానవ అనే రెండు ఎత్తైన విగ్రహాలున్నాయి. వీటిని స్థానికులు  భీమార్జునులదని చెబుతారు. మరికొందరు విష్ణువు నివశించే వైకుంఠం ద్వారపాలకులైన జయ విజేయులని కూడా అంటారు. 

4 / 7

ఈ ఆలయం ఉనికికి సంబంధించి పురాణ కథనం ప్రకారం పాండవులు కాలు పెట్టిన పవిత్ర స్థలాల్లో లఖమండల్ మందిరం కూడా ఒకటి.  పాండవులు అజ్జాత వాసంలో ఉన్న సమయంలో ఈ లఖమండల్ మందిరంలో కొద్ది రోజుల పాటు గడిపారని చెబుతారు. కౌరవులు పాండవులను సజీవ దహనం చేయాలనీ నిర్ణయించుకున్న లక్క గృహమే ఈ ప్రస్తుత దేవాలయమని భక్తులు నమ్ముతారు.

ఈ ఆలయం ఉనికికి సంబంధించి పురాణ కథనం ప్రకారం పాండవులు కాలు పెట్టిన పవిత్ర స్థలాల్లో లఖమండల్ మందిరం కూడా ఒకటి.  పాండవులు అజ్జాత వాసంలో ఉన్న సమయంలో ఈ లఖమండల్ మందిరంలో కొద్ది రోజుల పాటు గడిపారని చెబుతారు. కౌరవులు పాండవులను సజీవ దహనం చేయాలనీ నిర్ణయించుకున్న లక్క గృహమే ఈ ప్రస్తుత దేవాలయమని భక్తులు నమ్ముతారు.

5 / 7
ఈ అద్భుతమైన దేవాలయం సంబంధించిన మరో ఆశ్చర్యకరమైన వాస్తవం అద్దం లాంటి శివలింగం. ఈ లింగానికి అభిషేకం చేస్తే..  అద్భుతంగా మెరుస్తూ నీరు పోసిన వారి ముఖ ప్రతిబింబం కూడా లింగంపై స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు అభిషేకం చేసిన నీరు రుచి తియ్యగా మారుతుంది.  

ఈ అద్భుతమైన దేవాలయం సంబంధించిన మరో ఆశ్చర్యకరమైన వాస్తవం అద్దం లాంటి శివలింగం. ఈ లింగానికి అభిషేకం చేస్తే..  అద్భుతంగా మెరుస్తూ నీరు పోసిన వారి ముఖ ప్రతిబింబం కూడా లింగంపై స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు అభిషేకం చేసిన నీరు రుచి తియ్యగా మారుతుంది.  

6 / 7
మరొక విశేషం ఏమిటంటే మహాశివరాత్రి నాడు ఆలయంలో రాత్రంతా ఉండి, శివలింగాన్ని చూస్తూ భగవంతుని నామాన్ని జపించిన స్త్రీకి సంతానం కలుగుతుందని విశ్వాసం. 

మరొక విశేషం ఏమిటంటే మహాశివరాత్రి నాడు ఆలయంలో రాత్రంతా ఉండి, శివలింగాన్ని చూస్తూ భగవంతుని నామాన్ని జపించిన స్త్రీకి సంతానం కలుగుతుందని విశ్వాసం. 

7 / 7
Follow us
Latest Articles
'కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా'.. బండి సంజయ్..
'కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా'.. బండి సంజయ్..
ఐపీఎల్‌లో అత్యధిసార్లు 200 పరుగులు చేసిన జట్లు ఇవే..
ఐపీఎల్‌లో అత్యధిసార్లు 200 పరుగులు చేసిన జట్లు ఇవే..
అమ్మాయి పరిచయమై.. కలుద్దాం అంది.. ఆశపడిన యువకుడికి నిరాశ..
అమ్మాయి పరిచయమై.. కలుద్దాం అంది.. ఆశపడిన యువకుడికి నిరాశ..
రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట
రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట
ఫాలోవర్స్‌కి టెస్లా కార్లు గిఫ్ట్‌గా ఇవ్వనున్న ప్రముఖ యూట్యూబర్‌
ఫాలోవర్స్‌కి టెస్లా కార్లు గిఫ్ట్‌గా ఇవ్వనున్న ప్రముఖ యూట్యూబర్‌
అత్యాచారం కేసు పెట్టిన యువతికి 4 ఏళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే ??
అత్యాచారం కేసు పెట్టిన యువతికి 4 ఏళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే ??
ఉదయం లేవగానే ఈ ఒక్క పనీ చెయ్యండి.. మీ ముఖం మెరుస్తుంది
ఉదయం లేవగానే ఈ ఒక్క పనీ చెయ్యండి.. మీ ముఖం మెరుస్తుంది
టీచరమ్మ నిర్వాకం.. ప్రోగ్రెస్‌ ను చూసి తల్లిదండ్రులు షాక్‌
టీచరమ్మ నిర్వాకం.. ప్రోగ్రెస్‌ ను చూసి తల్లిదండ్రులు షాక్‌
నిద్ర లేపి, కర్రలతో బెదిరించి మరీ దోచేశారు
నిద్ర లేపి, కర్రలతో బెదిరించి మరీ దోచేశారు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దుష్ప్రచారంపై ఖండించిన సజ్జల..
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దుష్ప్రచారంపై ఖండించిన సజ్జల..