Secunderabad : దక్షిణ మధ్య రైల్వే అరుదైన రికార్డు.. మొట్టమొదటి సారిగా రూ.20,000 కోట్లు

దక్షిణ మధ్య రైల్వే 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్థూల మూలాధార ఆదాయంలో రూ. 20,339.36 కోట్ల ఆదాయాన్ని నమోదుచేసింది. ఇది జోన్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు ఇదే తొలిసారిగా చెబుతున్నారు రైల్వే అధికారులు. 2022-23లో సాధించిన రూ. 18,976 కోట్ల కంటే 7 శాతం అధికంగా లెక్కలు చెబుతున్నాయి.ఈ ఆదాయం పెరుగుదలకు ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే.. ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి చేపట్టిన ముఖ్యమైన చర్యలు కీలకంగా ఉన్నాయి.

|

Updated on: Apr 18, 2024 | 9:34 AM

దక్షిణ మధ్య రైల్వే 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్థూల మూలాధార ఆదాయంలో రూ. 20,339.36 కోట్ల ఆదాయాన్ని నమోదుచేసింది.  ఇది జోన్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు ఇదే తొలిసారిగా చెబుతున్నారు రైల్వే అధికారులు. 2022-23లో సాధించిన రూ. 18,976 కోట్ల కంటే 7 శాతం అధికంగా లెక్కలు చెబుతున్నాయి.

దక్షిణ మధ్య రైల్వే 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్థూల మూలాధార ఆదాయంలో రూ. 20,339.36 కోట్ల ఆదాయాన్ని నమోదుచేసింది. ఇది జోన్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు ఇదే తొలిసారిగా చెబుతున్నారు రైల్వే అధికారులు. 2022-23లో సాధించిన రూ. 18,976 కోట్ల కంటే 7 శాతం అధికంగా లెక్కలు చెబుతున్నాయి.

1 / 8
ఈ ఆదాయం పెరుగుదలకు ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే.. ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి చేపట్టిన ముఖ్యమైన చర్యలు కీలకంగా ఉన్నాయి. అందులో సరి కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం, ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తేవడం, డిమాండ్ ఉన్న రైళ్లలో అదనపు కోచ్‌ల జోడించడం, రద్దీ ఉన్న ప్రాంతాలకు రైళ్లను పెంచడం వంటి చర్యలను తీసుకుంది రైల్వే శాఖ.

ఈ ఆదాయం పెరుగుదలకు ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే.. ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి చేపట్టిన ముఖ్యమైన చర్యలు కీలకంగా ఉన్నాయి. అందులో సరి కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం, ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తేవడం, డిమాండ్ ఉన్న రైళ్లలో అదనపు కోచ్‌ల జోడించడం, రద్దీ ఉన్న ప్రాంతాలకు రైళ్లను పెంచడం వంటి చర్యలను తీసుకుంది రైల్వే శాఖ.

2 / 8
2023-24 ఆర్థిక సంవత్సరంలో అధిక ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి 117 రైళ్లలో తాత్కాలిక ప్రాతిపదికన 6,921 అదనపు కోచ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  ఈ చర్యల ద్వారా ప్రయాణీకుల రవాణా ద్వారా రూ. 5,731.8 కోట్ల అత్యుత్తమ ఆదాయాన్ని సాధించడంలో దోహద పడినట్లు తెలిపారు.

2023-24 ఆర్థిక సంవత్సరంలో అధిక ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి 117 రైళ్లలో తాత్కాలిక ప్రాతిపదికన 6,921 అదనపు కోచ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ చర్యల ద్వారా ప్రయాణీకుల రవాణా ద్వారా రూ. 5,731.8 కోట్ల అత్యుత్తమ ఆదాయాన్ని సాధించడంలో దోహద పడినట్లు తెలిపారు.

3 / 8
అదే సమయంలో, ప్రయాణీకుల రవాణ విషయానికొస్తే, 2022-23సంవత్సరంలోని 255.59 మిలియన్లతో పోలిస్తే 2023-24 సంవత్సరంలో 262.62 మిలియన్ల మంది ప్రయాణీకులు దక్షిణ మధ్య రైల్వే ద్వారా  ప్రయాణించినట్లు తెలుస్తోంది.

అదే సమయంలో, ప్రయాణీకుల రవాణ విషయానికొస్తే, 2022-23సంవత్సరంలోని 255.59 మిలియన్లతో పోలిస్తే 2023-24 సంవత్సరంలో 262.62 మిలియన్ల మంది ప్రయాణీకులు దక్షిణ మధ్య రైల్వే ద్వారా ప్రయాణించినట్లు తెలుస్తోంది.

4 / 8
2023-24 ఆర్థిక సంవత్సరంలో, దక్షిణ మధ్య రైల్వే మునుపెన్నడూ లేనివిధముగా రూ.13,620 కోట్ల సాధించింది. ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 4.4% పెరుగుదలను నమోదుచేసింది. సరుకు రవాణా సేవల మెరుగుదలను పెంపొందించడం కోసం 6 కొత్త గతి శక్తి కార్గో టెర్మినల్స్ ఏర్పాటు చేశారు.

2023-24 ఆర్థిక సంవత్సరంలో, దక్షిణ మధ్య రైల్వే మునుపెన్నడూ లేనివిధముగా రూ.13,620 కోట్ల సాధించింది. ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 4.4% పెరుగుదలను నమోదుచేసింది. సరుకు రవాణా సేవల మెరుగుదలను పెంపొందించడం కోసం 6 కొత్త గతి శక్తి కార్గో టెర్మినల్స్ ఏర్పాటు చేశారు.

5 / 8
సరుకు రవాణా వినియోగదారుల కోసం లోడింగ్, అన్‌లోడ్ ప్రక్రియ కోసం అనేక ముఖ్యమైన వస్తువులను భద్రపరచడానికి షెడ్‌లను గణనీయంగా పెంచారు. అందులో మౌళిక సదుపాయాలు, అవసరమైన మెరుగులు దిద్దడం వల్ల రైల్వేల ద్వారా రవాణా చేసేందుకు వినియోగదార్లు మొగ్గుచూపారు. అందుకే దక్షిణ మధ్య రైల్వేకు మునుపెన్నడూలేనివిధంగా 141.12 మిలియన్ టన్నులు అత్యుత్తమ సరుకు రవాణా లోడింగ్ చేయడానికి దారితీసింది.

సరుకు రవాణా వినియోగదారుల కోసం లోడింగ్, అన్‌లోడ్ ప్రక్రియ కోసం అనేక ముఖ్యమైన వస్తువులను భద్రపరచడానికి షెడ్‌లను గణనీయంగా పెంచారు. అందులో మౌళిక సదుపాయాలు, అవసరమైన మెరుగులు దిద్దడం వల్ల రైల్వేల ద్వారా రవాణా చేసేందుకు వినియోగదార్లు మొగ్గుచూపారు. అందుకే దక్షిణ మధ్య రైల్వేకు మునుపెన్నడూలేనివిధంగా 141.12 మిలియన్ టన్నులు అత్యుత్తమ సరుకు రవాణా లోడింగ్ చేయడానికి దారితీసింది.

6 / 8
ఇక టిక్కెట్ చెకింగ్ వలన వచ్చిన రాబడి కూడా కీలకమైంది. జోన్ 2023-24 సంవత్సరంలో రూ. 512 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది 2022-23 సంవత్సరంలో  నమోదైన రూ. 414.87 కోట్ల ఆదాయం కంటే ఎక్కువ.

ఇక టిక్కెట్ చెకింగ్ వలన వచ్చిన రాబడి కూడా కీలకమైంది. జోన్ 2023-24 సంవత్సరంలో రూ. 512 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది 2022-23 సంవత్సరంలో నమోదైన రూ. 414.87 కోట్ల ఆదాయం కంటే ఎక్కువ.

7 / 8
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఈ అద్భుతమైన మైలురాయిని సాధించడంలో కృషి చేసిన అధికారులు, సిబ్బందిని ప్రశంసించారు. రైలు ప్రయాణీకుల ప్రయోజనాల కోసం మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తామన్నారు.

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఈ అద్భుతమైన మైలురాయిని సాధించడంలో కృషి చేసిన అధికారులు, సిబ్బందిని ప్రశంసించారు. రైలు ప్రయాణీకుల ప్రయోజనాల కోసం మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తామన్నారు.

8 / 8
Follow us