Ganesh Chaturthi 2024: దేశంలోని ఈ 3 గణేశుడి ఆలయాలను దర్శిస్తే మీ కోరికలు 100శాతం నెరవేరుతాయి..!
వినాయక చవితి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గణేశోత్సవం అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. 10 రోజుల పాటు జరిగే ఈ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 17 వరకు గణేశ ఉత్సవాలు జరగనున్నాయి. అటువంటి శుభ సందర్భంగా భారతదేశంలోని మూడు అద్భుతమైన గణపతి దేవాలయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Sep 09, 2024 | 5:33 PM

Ganesh Idols

దేశంలోని ఈ మూడు ఆలయాలు ప్రత్యేకించి గణపతి దేవాలయాలుగా ప్రసిద్ధి. ఇక్కడికి వెళ్లి పూజలు చేసిన ఏ భక్తుడు కూడా ఖాళీ చేతులతో తిరిగి వెళ్లడు. ఈ ఆలయాన్ని సందర్శించిన ప్రతి భక్తుని కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. భారతదేశంలోని ఈ మూడు దేవాలయాలు మనదేశంలోనే కాదు.. విదేశాల్లోనూ ప్రసిద్ధి చెందాయి.

సిద్ధివినాయక దేవాలయం: ముంబైలోని శ్రీ సిద్ధివినాయక్ గణపతి మందిరం భారతదేశంలోని గణేష్ అత్యంత ప్రసిద్ధ ఆలయం. మహారాష్ట్రలోని ప్రసిద్ధ గణపతి దేవాలయాలలో ఒకటి. సిద్ధివినాయక దేవాలయం భారతదేశంలోని అత్యంత సంపన్నమైన ఆలయ ట్రస్ట్లో ఒకటి. గణేష్ చతుర్థి సమయంలో తప్పక సందర్శించవలసిన దేవాలయం ఇది.

ఖజ్రా గణేశ దేవాలయం : ఖజ్రాన్ గణేశ దేవాలయం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఉంది. ఈ ఆలయం వేలాది మంది భక్తుల నమ్మకం, విశ్వాసానికి కేంద్రంగా ఉంది. ఏడాది పొడవునా ఇక్కడకు భక్తులు పోటెత్తుతారు. వినాయక ఉత్సవాల సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు. ఈ వినాయకుని ఆలయాన్ని సందర్శించిన భక్తుల కోరికలు తప్పక నెరవేరుతాయి.

మోతీ డుంగ్రి గణేశ్ ఆలయం: గణేశుడు కొలువై ఉన్న మరో ఆలయం రాజస్థాన్లోని జైపూర్లో ఉంది. జైపూర్లోని మోతీ డుంగ్రి గణేశ్ ఆలయం 250 సంవత్సరాల క్రితం నిర్మించారు. 1761 లో నిర్మించినట్లు చెబుతారు. కోటలు, కొండల మధ్య నిర్మించబడిన ఈ ఆలయం జైపూర్లోని పురాతన దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయంలో శివరాత్రి నాడు భక్తులు శివలింగాన్ని పూజిస్తారు. ఇది జైపూర్ సిటీకి 6 కి.మీటర్ల దూరంలో ఉంది. మోతీ డుంగ్రీ దేవాలయం దేశంలోనే అత్యంత అందమైన, పురాతనమైన గణేశ దేవాలయం. ఇక్కడ గణపతి తన భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తాడని బలంగా నమ్ముతారు.




