AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: బందీపూర్ టైగర్‌ రిజర్వును సందర్శించిన నరేంద్ర మోదీ.. సరికొత్త లుక్‌లో ప్రధాని.

ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు, కర్ణాటక పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. ఇందులో భాగంగా కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్‌‌లో సఫారీ ట్రిప్ వేశారు. అందుకు సంబంధించిన ఫొటోలను తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి...

Narender Vaitla
|

Updated on: Apr 09, 2023 | 4:45 PM

Share
 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం  బందీపూర్ టైగర్ రిజర్వ్‌లో సఫారీని ప్రధాని సందర్శించారు. దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణించి అటవీ అందాలను ఆస్వాదించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం బందీపూర్ టైగర్ రిజర్వ్‌లో సఫారీని ప్రధాని సందర్శించారు. దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణించి అటవీ అందాలను ఆస్వాదించారు.

1 / 5
ఈ సందర్భంగా మోదీ నయా లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఖాకీ ప్యాంట్‌, కామోఫ్లాజ్‌ టి-షర్ట్‌, స్లీవ్‌లెస్‌ జాకెట్‌ ధరించి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ టైగర్‌ రిజర్వ్‌ను సందర్శించిన తొలి ప్రధానిగా మోదీ నిలిచారు.

ఈ సందర్భంగా మోదీ నయా లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఖాకీ ప్యాంట్‌, కామోఫ్లాజ్‌ టి-షర్ట్‌, స్లీవ్‌లెస్‌ జాకెట్‌ ధరించి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ టైగర్‌ రిజర్వ్‌ను సందర్శించిన తొలి ప్రధానిగా మోదీ నిలిచారు.

2 / 5
 ఇదిలా ఉంటే ఉంటే.. 1941 ఫిబ్రవరి 19న బందీపూర్ అడవిని రిజర్వ్ ఫారెస్ట్ గా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాని సందర్శిస్తున్న టైగర్ రిజర్వ్ చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేట్ తాలూకాలో కొంత భాగం.

ఇదిలా ఉంటే ఉంటే.. 1941 ఫిబ్రవరి 19న బందీపూర్ అడవిని రిజర్వ్ ఫారెస్ట్ గా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాని సందర్శిస్తున్న టైగర్ రిజర్వ్ చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేట్ తాలూకాలో కొంత భాగం.

3 / 5
దీంతో పాటు ప్రధాని తమిళనాడు ప్రాంతంలోని మదులై ఫారెస్ట్‌ వెళ్లారు. ఇక్కడ తెపకాడు ఎలిఫాంట్ క్యాంపును సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్కార్‌ అవార్డును గెలుచుకున్న ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ డాక్యుమెంటరీలో కనిపించిన ఏనుగులను ప్రధాని చూశారు.

దీంతో పాటు ప్రధాని తమిళనాడు ప్రాంతంలోని మదులై ఫారెస్ట్‌ వెళ్లారు. ఇక్కడ తెపకాడు ఎలిఫాంట్ క్యాంపును సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్కార్‌ అవార్డును గెలుచుకున్న ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ డాక్యుమెంటరీలో కనిపించిన ఏనుగులను ప్రధాని చూశారు.

4 / 5
 ఈ డాక్యుమెంటరీలో కనిపించిన బొమ్మన్, వల్లిలను కలిసిన ప్రధాని.. డాక్యుమెంటరీలోని ఏనుగు రఘు దగ్గరికి వెళ్లి దానిని ముద్దు చేశారు.. అనంతరం రఘుకు చెరుకుగడలు తినిపించారు.

ఈ డాక్యుమెంటరీలో కనిపించిన బొమ్మన్, వల్లిలను కలిసిన ప్రధాని.. డాక్యుమెంటరీలోని ఏనుగు రఘు దగ్గరికి వెళ్లి దానిని ముద్దు చేశారు.. అనంతరం రఘుకు చెరుకుగడలు తినిపించారు.

5 / 5
Follow Us