- Telugu News Photo Gallery Pachnada sangam: Five Rivers meets at one place in district jalaun Telugu News
ఐదు నదుల సంగమం ..ప్రపంచంలో ఇక్కడ మాత్రమే కనిపించే అద్భుతం.. ఎక్కడో తెలుసా..?
ఉత్తరప్రదేశ్ లోని జలౌన్, ఇటావా సరిహద్దులో ఉన్న పంచనద్ ప్రాంతం ప్రకృతి ఇచ్చిన అపూర్వమైన బహుమతి. ప్రపంచంలో ఎక్కడా కనిపించని విధంగా ఐదు నదుల సంగమం ఇక్కడ ప్రత్యేకం. అందుకే పంచనద్ ప్రాంతాన్ని మహా తీర్థరాజ్ అని పిలుస్తారు.
Updated on: Jun 19, 2023 | 9:39 PM

ప్రపంచంలో ఐదు నదుల సంగమం ఉన్న ఏకైక ప్రదేశం పంచనాద్. ఇక్కడ యమునా, చంబల్, సింధ్, పహుజ్, క్వారీ నదులు ఒక చోట కలిసి ప్రవహిస్తున్నాయి.

మహాభారత కాలంలో పాండవులు వనవాస సమయంలో ఈ పంచనద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఒక సంవత్సరం గడిపారని చెబుతారు.

ఈ ఐదు నదుల సంగమాన్ని మహాతీర్థ రాజ్ సంగమం అంటారు. బుందేల్ఖండ్లోని జలౌన్లో ఐదు నదుల సంగమం జరుగుతుంది.

ప్రతి సంవత్సరం కార్తీక పూర్ణిమ నాడు ఇక్కడ చారిత్రాత్మకమైన జాతర జరుగుతుంది. ఈ జాతరకు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు.

జలౌన్ జిల్లా సరిహద్దులో పచ్నాడ్ ఒడ్డున బాబా సాహెబ్ ఆలయం, నదులకు అవతలి వైపున ఇటావా జిల్లాలో కాళేశ్వరుని ఆలయం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి.

ఆలయానికి సంబంధించిన కొన్ని నిజాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇక్కడ తన తపస్సులో మునిగి ఉన్న ముచ్కుంద్ మహారాజ్ తపస్సు చేస్తున్న సమయంలో ఒక గుహలో మాయమయ్యాడు. అతని శరీరం నేటికీ కనుగొనబడలేదు. ప్రస్తుతం ఆయన పాదాలకు ఆలయ ప్రాంగణంలో పూజలు జరుగుతున్నాయి.





























