New Rules: సామాన్యులకు అలెర్ట్.. మార్చి నుంచి అమలులోకి కొత్త నిబంధనలు.. అవేంటంటే.?
కొత్త నెల వచ్చేసింది. దానితో పాటు మన జేబు ఖాళీ చేసేందుకు న్యూ రూల్స్ కూడా అమలులోకి వచ్చేశాయ్. ముఖ్యంగా బ్యాంకింగ్, గ్యాస్ సిలిండర్..
Updated on: Mar 02, 2023 | 7:48 AM

కొత్త నెల వచ్చేసింది. దానితో పాటు మన జేబు ఖాళీ చేసేందుకు న్యూ రూల్స్ కూడా అమలులోకి వచ్చేశాయ్. ముఖ్యంగా బ్యాంకింగ్, గ్యాస్ సిలిండర్, ఆదాయపు పన్ను, ఈపీఎఫ్వో ఇలా ఎన్నో నిబంధనలలో మార్పులు వచ్చాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా..


బ్యాంకు రుణాలు: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలే రెపోరేటును 25 బేసిస్ పాయింట్లకు పెంచిన విషయం తెలిసిందే. దీంతో వివిధ రకాల రుణాలపై వడ్డీ రేట్లు అమాంతం పెరిగాయి. అటు రుణాలను నిర్ణయించే బేస్ రేటు ఎంసీఎల్ఆర్ను పెంచుతున్నట్లు ఇప్పటికే బ్యాంకులు ప్రకటించడంతో.. మార్చి 1 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి రానున్నాయి.

ఎస్బీఐ క్రెడిట్ కార్డు: ఎస్బీఐ క్రెడిట్ చార్జీలు పెరిగాయి. ఈ కొత్త ఛార్జీలు మార్చి 17 నుంచి అమల్లోకి రానున్నాయి. గతంలో ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై క్రెడ్ ద్వారా అద్దె చెల్లించేవారికి రూ. 99గా ఉన్న ఈ చార్జ్ను.. ఈసారి ఎస్బీఐ డబుల్ చేసి.. ఏకంగా రూ.199గా నిర్ణయించింది.

గృహ పునరుద్ధరణ కోసం: కొత్త ప్రావిడెంట్ ఫండ్ నిబంధనలలో వడ్డీ, 12 నెలల బేసిక్ పే + డియర్నెస్ అలవెన్స్తో పాటు ఉద్యోగి వాటాలో తక్కువ మొత్తంలో గృహ పునరుద్ధరణల కోసం ఉపసంహరణలను అనుమతించే నిబంధన ఉంది. రెసిడెన్షియల్ ప్రాపర్టీ PF ఖాతాదారు, అతని లేదా ఆమె జీవిత భాగస్వామి లేదా వారిద్దరూ కలిగి ఉండవచ్చు. ఒక వ్యక్తి రెసిడెన్షియల్ ప్రాపర్టీని పూర్తి చేసిన 5 సంవత్సరాల తర్వాత ఒకసారి 2 సార్లు ఈ సదుపాయాన్ని పొందవచ్చు. 10 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా PF మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. 54 ఏళ్లు దాటిన లేదా పదవీ విరమణకు ఒక సంవత్సరం ముందు, ఖాతాదారులు సవరించిన EPF ఉపసంహరణ ప్రమాణాల ప్రకారం 90% వరకు సేకరించిన నిధులను విత్డ్రా చేసుకోవడానికి కూడా అనుమతిస్తారు.

సోషల్ మీడియా ఫిర్యాదులు: ఇక సామాజిక మాధ్యమాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించేందుకు మూడు ఫిర్యాదులు అప్పీలేట్ కమిటీలను ఏర్పాటు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ కమిటీలు మార్చి 1వ తేదీ నుంచి పని చేయనున్నాయి. కేవలం 30 రోజుల్లోనే ఫిర్యాదులు పరిష్కారమవుతాయి.





























