AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్ న్యూస్.. వారం రోజుల్లోనే ప్రారంభం.. ప్రభుత్వం సూపర్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డులపై సూపర్ న్యూస్ అందించింది. త్వరలోనే కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనుంది. వారం రోజుల్లో ప్రక్రియను స్టార్ట్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వీటి వివరాలు చూస్తే..

Venkatrao Lella
|

Updated on: Jul 20, 2026 | 10:27 AM

Share
తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్. త్వరలో కొత్త రేషన్ కార్డులు అందనున్నాయి. రేవంత్ సర్కార్ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు సిద్దమవుతోంది. మరో వారం రోజుల్లో కొత్త కార్డులను అందించనుంది. ప్రస్తుతం కాగితపు కార్డులు ఉండగా.. వీటి స్థానంలో పీవీసీ కార్డులను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనుండగా.. 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అందించనున్నారు.

తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్. త్వరలో కొత్త రేషన్ కార్డులు అందనున్నాయి. రేవంత్ సర్కార్ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు సిద్దమవుతోంది. మరో వారం రోజుల్లో కొత్త కార్డులను అందించనుంది. ప్రస్తుతం కాగితపు కార్డులు ఉండగా.. వీటి స్థానంలో పీవీసీ కార్డులను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనుండగా.. 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అందించనున్నారు.

1 / 5
ఈ స్మార్ట్ కార్డులు అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. వీటిపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. అంటే హెచ్‌ఎఎఫ్ వివరాలు, సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు ఉంటాయి. వారం రోజుల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా రేవంత్ సర్కార్ ప్రారంభించనుంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకేసారి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల చేతుల మీదుగా ఈ కొత్త కార్డులు అందించేలా ప్రభుత్వం కార్యక్రమాన్ని రూపొందించింది.

ఈ స్మార్ట్ కార్డులు అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. వీటిపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. అంటే హెచ్‌ఎఎఫ్ వివరాలు, సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు ఉంటాయి. వారం రోజుల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా రేవంత్ సర్కార్ ప్రారంభించనుంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకేసారి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల చేతుల మీదుగా ఈ కొత్త కార్డులు అందించేలా ప్రభుత్వం కార్యక్రమాన్ని రూపొందించింది.

2 / 5
ఈ పీవీసీ కార్డులు నాణ్యంగా, ఆధునికంగా ఉంటాయి. ఇవి చినిగిపోయే లేదా పాడైపోయే అవకాశముంది. ఈ కార్డుల్లో ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తు్న్నారు. క్యూఆర్ కోడ్, కార్డు నెంబర్, కుటుంబ పెద్ద వివరాలు ఉంటాయి. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ఫొటో ఉంటుండగా.. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటో ఉంటుంది. వీటి వల్ల పారదర్శకతతో క్యూఆర్ కోడ్ ఉండటం వల్ల సులువుగా రేషన్ పొందవచ్చు.

ఈ పీవీసీ కార్డులు నాణ్యంగా, ఆధునికంగా ఉంటాయి. ఇవి చినిగిపోయే లేదా పాడైపోయే అవకాశముంది. ఈ కార్డుల్లో ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తు్న్నారు. క్యూఆర్ కోడ్, కార్డు నెంబర్, కుటుంబ పెద్ద వివరాలు ఉంటాయి. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ఫొటో ఉంటుండగా.. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటో ఉంటుంది. వీటి వల్ల పారదర్శకతతో క్యూఆర్ కోడ్ ఉండటం వల్ల సులువుగా రేషన్ పొందవచ్చు.

3 / 5
తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి కాగితపు కార్డు స్థానంలో పీవీసీ స్మార్ట్ కార్డులు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఏ4 సైజ్ పేపర్‌ రూపంలో ఉండే కార్డును లబ్దిదారులు ఉపయోగిస్తున్నారు. అయితే పేపర్ కావడంతో త్వరగా చిరిగిపోయే అవకాశముంది. అలాగే త్వరలో పాడైపోయే అవకాశం ఉండటంతో ఈ కొత్త పీవీసీ కార్డులను రూపొందించింది.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి కాగితపు కార్డు స్థానంలో పీవీసీ స్మార్ట్ కార్డులు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఏ4 సైజ్ పేపర్‌ రూపంలో ఉండే కార్డును లబ్దిదారులు ఉపయోగిస్తున్నారు. అయితే పేపర్ కావడంతో త్వరగా చిరిగిపోయే అవకాశముంది. అలాగే త్వరలో పాడైపోయే అవకాశం ఉండటంతో ఈ కొత్త పీవీసీ కార్డులను రూపొందించింది.

4 / 5
ఇక ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలకు సంబంధించిన రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వర్షాల క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 1 నుంచి ఈ పంపిణీ చేపట్టనుంది. ఈకేవైసీ ద్వారా రేషన్ కార్డు లబ్దిదారులు రేషన్ తీసుకోవచ్చు.

ఇక ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలకు సంబంధించిన రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వర్షాల క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 1 నుంచి ఈ పంపిణీ చేపట్టనుంది. ఈకేవైసీ ద్వారా రేషన్ కార్డు లబ్దిదారులు రేషన్ తీసుకోవచ్చు.

5 / 5
Follow Us