వరలక్ష్మీ వ్రతం చేశారు…అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
విశాఖపట్నం గాజువాకలో వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారికి అలంకరించిన ఐదు తులాల బంగారు నగలను ఉడుముల రమేష్, దివ్య దంపతులు పొరపాటున పూజా సామాగ్రితో పాటు డ్రైనేజీలో పడేశారు. గుర్తించిన వెంటనే పోలీసులను ఆశ్రయించగా, స్టీల్ ప్లాంట్ సీఐ కేశవరావు నేతృత్వంలో గంటల తరబడి శ్రమించి ఆ నగలను వెలికితీసి వారికి అప్పగించారు. ఈ అద్భుత రెస్క్యూతో కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.
విశాఖపట్నం, గాజువాకలో జరిగిన ఒక సంఘటన వరలక్ష్మీ వ్రతం సందర్భంగా భక్తుల అప్రమత్తతకు నిదర్శనంగా నిలిచింది. పండగ పూట అమ్మవారికి భక్తిశ్రద్ధలతో అలంకరించిన బంగారు ఆభరణాలను ఒక కుటుంబం పొరపాటున డ్రైనేజీలో పడేసింది. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి: విశాఖపట్నం, గాజువాకలోని శ్రీనగర్కు చెందిన ఉడుముల రమేష్, దివ్య దంపతులు వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవారికి ఎనిమిది తులాల బంగారు ఆభరణాలను అలంకరించారు. పూజానంతరం రమేష్ కొన్ని నగలను తీసివేశారు. అయితే, పూల మధ్యలో ఉండిపోయిన ఐదు తులాల బంగారు ఆభరణాలు గమనించకుండా, పూజా సామాగ్రితో పాటు వాటిని కూడా ఎర్రటి వస్త్రంలో చుట్టి దుర్గానగర్ రైల్వే బ్రిడ్జి కింద ఉన్న డ్రైనేజీ కాలువలో పడేశారు. ఇంటికి వెళ్లిన తర్వాత బంగారం కనిపించకపోవడంతో ఆందోళన చెందిన దంపతులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు.
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారతీయ రైల్వే
ఉద్యోగం నిలబెట్టుకోవాలంటే..ఈ 5 స్కిల్స్ తప్పనిసరి..!
గ్యాస్ అక్కర్లేదు.. కిరోసిన్, నీటితో నడిచే స్టవ్ వచ్చేసింది
బోను నుంచి తప్పించుకున్న చిరుత.. ఆ తర్వాత సీన్ చూస్తే..
సముద్ర గర్భంలో భారీగా బంగారం, వెండి..వేట మొదలు పెట్టిన చైనా
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్కు గిఫ్ట్గా!

