AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

వరలక్ష్మీ వ్రతం చేశారు…అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

Phani CH
|

Updated on: Aug 28, 2026 | 10:42 PM

Share

విశాఖపట్నం గాజువాకలో వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారికి అలంకరించిన ఐదు తులాల బంగారు నగలను ఉడుముల రమేష్, దివ్య దంపతులు పొరపాటున పూజా సామాగ్రితో పాటు డ్రైనేజీలో పడేశారు. గుర్తించిన వెంటనే పోలీసులను ఆశ్రయించగా, స్టీల్ ప్లాంట్ సీఐ కేశవరావు నేతృత్వంలో గంటల తరబడి శ్రమించి ఆ నగలను వెలికితీసి వారికి అప్పగించారు. ఈ అద్భుత రెస్క్యూతో కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.

విశాఖపట్నం, గాజువాకలో జరిగిన ఒక సంఘటన వరలక్ష్మీ వ్రతం సందర్భంగా భక్తుల అప్రమత్తతకు నిదర్శనంగా నిలిచింది. పండగ పూట అమ్మవారికి భక్తిశ్రద్ధలతో అలంకరించిన బంగారు ఆభరణాలను ఒక కుటుంబం పొరపాటున డ్రైనేజీలో పడేసింది. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి: విశాఖపట్నం, గాజువాకలోని శ్రీనగర్‌కు చెందిన ఉడుముల రమేష్, దివ్య దంపతులు వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవారికి ఎనిమిది తులాల బంగారు ఆభరణాలను అలంకరించారు. పూజానంతరం రమేష్ కొన్ని నగలను తీసివేశారు. అయితే, పూల మధ్యలో ఉండిపోయిన ఐదు తులాల బంగారు ఆభరణాలు గమనించకుండా, పూజా సామాగ్రితో పాటు వాటిని కూడా ఎర్రటి వస్త్రంలో చుట్టి దుర్గానగర్ రైల్వే బ్రిడ్జి కింద ఉన్న డ్రైనేజీ కాలువలో పడేశారు. ఇంటికి వెళ్లిన తర్వాత బంగారం కనిపించకపోవడంతో ఆందోళన చెందిన దంపతులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు.

Follow Us