AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీమ్‌ మీటింగ్‌లో రచ్చ.. గంభీర్‌ను ఏకిపారేసిన గిల్.. అసలేం జరిగింది?

Shubman Gill vs Gautam Gambhir: శ్రీలంకతో టెస్ట్ డ్రా తర్వాత BCCI సమీక్షలో శుభ్‌మన్ గిల్, గౌతమ్ గంభీర్ మధ్య వ్యూహాత్మక విభేదాలు తలెత్తినట్లు నివేదికలు చెబుతున్నాయి. బౌలింగ్ వ్యూహాలు, ధ్రువ్ జురెల్ డిక్లరేషన్‌పై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఇది WTC ఫైనల్ అవకాశాలపైనా ప్రభావం చూపింది. అయితే, ఈ విభేదాలు అధికారికంగా ధ్రువీకరించబడలేదు, కేవలం నివేదిక ఆధారిత సమాచారంగానే చూడాలి.

టీమ్‌ మీటింగ్‌లో రచ్చ.. గంభీర్‌ను ఏకిపారేసిన గిల్.. అసలేం జరిగింది?
Shubman Gill Vs Gautam Gambhir
Venkata Chari
|

Updated on: Aug 31, 2026 | 12:32 PM

Share

Shubman Gill vs Gautam Gambhir: శ్రీలంకతో రెండో టెస్టు డ్రాగా ముగియడం టీమ్‌ఇండియాకు నిరాశ కలిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగుల ఆధిక్యం సాధించినా విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ నిర్వహించిన సమీక్ష సమావేశంలో కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్, ప్రధాన కోచ్‌ గౌతమ్‌ గంభీర్ మధ్య జరిగిన చర్చ ఆసక్తికరంగా మారింది. గిల్‌.. గంభీర్‌ నిర్ణయాన్ని బహిరంగంగా ప్రశ్నించినట్లు తాజాగా ఓ నివేదిక పేర్కొంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు.

బౌలర్లపై గంభీర్‌ అసంతృప్తి..

రెండో టెస్టులో శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో భారత పేసర్లు కొత్త బంతితో స్టంప్స్‌ను లక్ష్యంగా చేసుకోలేదని గంభీర్‌ అభిప్రాయపడినట్లు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రసిద్ధ్‌ కృష్ణ, మహ్మద్‌ సిరాజ్‌ ఎక్కువగా ఆఫ్‌స్టంప్‌ బయట బంతులు సంధించారని ఆయన సమావేశంలో వివరించినట్లు తెలిపింది.

ఎక్కువమంది చదివినది: Team India: ఇకపై నో బాల్స్ వేస్తే జేబుకు చిల్లే.. ఫైన్‌తోపాటు టీంమేట్స్‌కు డిన్నర్ పార్టీ..!

ఇవి కూడా చదవండి

అదే సమయంలో ధ్రువ్‌ జురేల్‌ సెంచరీ కోసం వేచి చూసి డిక్లేర్‌ చేయడంలో ఆలస్యం జరిగిందని కూడా గంభీర్‌ పేర్కొన్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. జురేల్‌ 99 పరుగుల వద్ద ఎక్కువ సమయం తీసుకోవడంతో ముందుగానే డిక్లేర్‌ చేసి ఉండాల్సిందని గంభీర్‌ అభిప్రాయపడినట్లు తెలిపింది.

గిల్‌ ఇచ్చిన సమాధానం ఏంటి..?

బౌలర్లు ఆఫ్‌స్టంప్‌ బయట ఎందుకు ఎక్కువ బంతులు వేశారన్న ప్రశ్నకు గిల్‌ తన వ్యూహాన్ని వివరించినట్లు కథనం పేర్కొంది. బ్యాటర్లు అప్పటికే క్రీజులో కుదురుకోవడంతో.. పరుగుల కోసం షాట్లు ఆడేలా చేసి క్యాచ్‌లు పట్టాలనే ఉద్దేశంతో ఆ లైన్‌లో బౌలింగ్‌ చేయించినట్లు గిల్‌ చెప్పినట్లు పేర్కొంది.

ఇక జురేల్‌ సెంచరీ కోసం ఎందుకు వేచి చూశారన్న ప్రశ్నకు గిల్‌ ఇచ్చిన సమాధానం మరింత ఆసక్తికరంగా మారింది. జురేల్‌కు వేగంగా సెంచరీ పూర్తి చేయాలని సందేశం పంపాలని తాను అనుకున్నానని.. అయితే అతడిపై ఒత్తిడి పెంచవద్దని గంభీర్‌ సూచించినట్లు గిల్‌ పేర్కొన్నాడు.

నిజంగానే గిల్‌-గంభీర్‌ మధ్య విభేదాలా..?

ఈ పరిణామాలను ఆధారంగా చేసుకుని గిల్‌, గంభీర్‌ మధ్య అసంతృప్తి ఉందనే చర్చ మొదలైంది. అయితే గిల్‌-గంభీర్‌ మధ్య విభేదాలు ఉన్నాయని అధికారికంగా నిర్ధారించే ఆధారం ప్రస్తుతం లేదు. మరోవైపు, రెండో టెస్టు అనంతరం గిల్‌ స్వయంగా జట్టు ప్రదర్శనకు పూర్తి మార్కులు ఇచ్చి, మ్యాచ్‌ డ్రాగా ముగియడం నిరాశ కలిగించిందని మాత్రమే చెప్పాడు.

ఎక్కువమంది చదివినది: Video: 6 ఫోర్లు, 7 సిక్సర్లతో విధ్వంసం.. 26 బంతుల్లో 296 స్ట్రైక్ రేట్‌తో కాటేరమ్మ కొడుకు ఊచకోత చూశారా..?

WTC ఫైనల్‌ అవకాశాలకు దెబ్బ..

శ్రీలంకతో సిరీస్‌ను భారత్‌ 1-0తో గెలిచినా రెండో టెస్టులో డ్రా కారణంగా వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసులో అవకాశాలు క్లిష్టంగా మారాయి. మిగిలిన ఏడు టెస్టుల్లో ఆరు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్‌ తదుపరి న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు, ఆస్ట్రేలియాతో స్వదేశంలో ఐదు టెస్టులు ఆడనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us