Banana: రోజూ ఒక అరటి పండు తింటున్నారా..? 30 రోజుల్లో మీ శరీరంలో జరిగే మార్పులు తెలిస్తే..
అరటిపండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు: అరటిపండ్లు ఆరోగ్యకరమైనవి, రుచికరమైనవి. అందుకే పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఇష్టపడతారు. మీరు ప్రతిరోజూ ఒక అరటిపండు తింటే, మీ శరీరం 30 రోజుల్లో అనేక అద్భుతమైన ప్రయోజనాలను చూస్తారు. అరటిపండ్లలోని B6 రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. అరటిపండు మన శరీరంలో త్వరిత శక్తి బూస్టర్గా పనిచేస్తుంది.
Updated on: Sep 23, 2024 | 6:50 AM

అరటి పండులో గ్లూకోజ్ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. దీని నుండి మన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అరటిపండు జీర్ణక్రియను బలోపేతం చేయడానికి ఉత్తమమైన పండుగా చెబుతున్నారు నిపుణులు. కడుపు సంబంధిత సమస్యలతో బాధపడేవారికి అరటిపండు చాలా మేలు చేస్తుంది. అరటిపండులో ఫైబర్, ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపు ఆరోగ్యాన్ని నియంత్రిస్తాయి. అటువంటి పరిస్థితిలో మీరు రోజుకు ఒక అరటిపండు తింటే మీ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మీకు తరచుగా గ్యాస్, అజీర్ణం సమస్యలు ఉంటే అరటిపండ్లను తినడం అలవాటు చేసుకోంది. అరటిపండు కడుపులో ఉత్పత్తి అయ్యే ఆమ్లాన్ని తటస్థీకరిస్తుంది. ఎసిడిటీ కారణంగా ఛాతీలో మంటను తగ్గిస్తుంది. మీకు అధిక రక్తపోటు ఉన్నట్లయితే, ప్రతిరోజూ అరటిపండు తినడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే అరటిపండ్లలో పొటాషియం ఎక్కువగానూ, సోడియం తక్కువగానూ ఉంటాయి. ఈ కారణంగా ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. అధిక రక్తపోటును సాధారణ స్థితిలో ఉంచడానికి సహాయపడుతుంది.

అవసరమైన పోషకాలు లేకపోవడం వల్ల శరీరం అలసిపోతుంది. కాబట్టి, మీరు పూర్తిగా తక్కువ శక్తిని అనుభవిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిరోజూ అరటిపండు తినడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే అరటిపండులో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి మీ శరీరానికి శక్తిని అందించడానికి పని చేస్తాయి. ఇందులో విటమిన్ ʼBʼ కూడా ఉంటుంది. ఇది శరీరంలో కార్బోహైడ్రేట్ల శోషణలో సహాయపడుతుంది. అరటిపండ్లు తినడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

ఎందుకంటే, అరటి పండులో పొటాషియం ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి అవసరమైన ఖనిజంగా పరిగణించబడుతుంది. ఒక నెల రోజుల పాటు ప్రతిరోజూ అరటిపండు తింటే, మీ గుండె మంచి ఆరోగ్యాన్ని మీరు గమనించవచ్చు. అరటిపండు మీ మనస్సుతో పాటు మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అరటి పండులో ఉండే విటమిన్ ʼCʼ మెదడు ఆరోగ్యానికి తోడ్పడే సెరోటోనిన్ని విడుదల చేస్తుంది.

అరటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఈ పండు అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ప్రతిరోజూ అరటిపండు తినడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని సులభంగా నివారించవచ్చు. అధిక రక్తపోటు నివారణకు ప్రతిరోజూ 2 అరటిపండ్లను తినడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే 1 వారంలోపు రక్తపోటును 10 శాతం వరకు తగ్గిస్తుంది.

ఇంకా, ఇది కాలేయం, మూత్రపిండాల నుండి అనవసరమైన రసాయనాలను తొలగిస్తుంది. నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అరటిపండును సాధారణంగా అల్పాహారంతో తీసుకోవడం మంచిది. ఇది తక్షణ శక్తిని ఇస్తుంది. రాత్రిపూట దీన్ని తినడం వీలైనంత వరకు మానుకోవాలి.




