మహిళలు కాళ్లకు వెండి పట్టీలు ధరించడం వెనక పెద్ద సైన్స్ ఉందని తెలుసా.? బంగారంతో చేసినవి ఎందుకు వాడొద్దంటే.
Silver Ancklets: భారతీయ మహిళలకు చిన్ననాటి నుంచే వెండిని తమ జీవితంలో ఓ భాగంగా మార్చేస్తుంటారు. పట్టీల నుంచి మెట్టెల వరకు వెండిని శరీరంపై ఉండేలా చూసుకుంటారు. ఇంతకీ వెండికి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారు? శరీరంపై వెండి ఉంటే కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Updated on: Aug 20, 2021 | 6:05 PM

భారతీయ మహిళలు కాళ్లకు వెండి పట్టీలు ధరించడం ఆచారంలో ఒక భాగంగా వస్తోంది. అమ్మాయి జన్మించిన నెల రోజులకే వెండి పట్టీలు వేసి పేరెంట్స్ మురిసిపోతుంటారు.

అంతేకాకుండా వివాహం అయిన తర్వాత కాలి వేళ్లకు వెండి మెట్టెలు తొడుగుతుంటారు. ఇలా మన పెద్దలు వెండిని మహిళల జీవితంలో ఒక భాగం చేశారు.

వెండిని ఇంతలా ఉపయోగించడం వెనక సైన్స్ ఉందని మీకు తెలుసా.? శాస్త్రీయంగా చెప్పాలంటే వెండి శరీరానికి చలువ చేస్తుంది. వెండితో చేసిన వస్తువులు శరీరంపై ఉంటే వేడి బయటకు పోతుంది.

వెండి పట్టీలను ధరించడం వల్ల నడుము నొప్పి, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిత్యం ఏదో ఒక పని చేస్తూ అలసిపోతారు కాబట్టే ఈ వెండి వస్తువులను మహిళల జీవితాల్లో భాగం చేశారంటా.

అంతేకాకుండా వెండి గజ్జెలు ధరించడం వల్ల రక్తప్రసరణ సజావుగా సాగుతూ, పాదాలు వాపులు రాకుండా సహకరిస్తాయి.

ఇక బంగారంతో చేసిన పట్టీలు ఎందుకు ధరించరంటే హిందూ సంప్రదాయం ప్రకారం బంగారాన్ని లక్ష్మీదేవీతో సమానంగా భావిస్తుంటారు. అందుకే కాళ్లకు పెట్టుకునే పట్టీలను గోల్డ్తో తయారు చేయరు.




