Janhvi Kapoor: తల్లి బాటలోనే వారసురాలు.. జాన్వీ సౌత్లో సెటిల్ అవుతుందా.?
నార్త్ నుంచి సౌత్కి టిక్కెట్ వేశారా.. వచ్చామా? షూటింగ్ చేశామా.. వెళ్లామా.. అన్నట్టుంటారు హీరోయిన్లు. కానీ జాన్వీ మాత్రం అలా ఆలోచించడం లేదు. శ్రీదేవి సౌత్ నుంచి వెళ్లి నార్త్ లో టాప్ ఛెయిర్ని కొట్టేసినట్టు, జాన్వీ.. నార్త్ నుంచి వచ్చి సౌత్లో సెటిల్ కావాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ఆమె లైనప్ చూసిన వారికి ఈ విషయం బాగా అర్థమవుతోంది.
Updated on: Feb 22, 2025 | 9:25 PM

దేవర సినిమాలో తంగం కేరక్టర్ చూడ్డానికి చిన్నదే. కానీ జాన్వీకి మంచి పేరే వచ్చింది. సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో లాంఛింగ్ వెంచర్ కేక అంటూ అందరూ ప్రశంసించేశారు. దేవర పార్ట్ 2 కోసం జాన్వీతో పాటు అందరూ వెయిటింగ్.

అలా దేవర సక్సెస్ని ఎంజాయ్ చేస్తూనే ఆర్సీ 16 పనులతో బిజీ అయిపోయారు జాన్వీ. చెర్రీతో నేను చేస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో ఎవరినీ అడగాల్సిన పనిలేదు. గెలుపు గ్యారంటీ అని బుచ్చిబాబు సానా కాన్ఫిడెంట్గా చెప్పిన తీరు చూసిన ప్రతి ఒక్కరూ.... జాన్వీకి సౌత్లో సెకండ్ హిట్ గ్యారంటీ అని ఫిక్స్ అయిపోయారు.

నాని - శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్టులో జాన్వీని హీరోయిన్గా అనుకుంటున్నట్టు ఆ మధ్య వార్తలు హల్చల్ చేశాయి. అయితే అందులో నిజం లేదని క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతానికి తెలుగులో గ్లోబల్ స్టార్ మూవీ మాత్రమే ప్రొడక్షన్లో ఉంది శ్రీదేవి తనయకు.

చెర్రీ సినిమా కంప్లీట్ కాగానే అల్లు అర్జున్ సెట్స్ కి వెళ్తారట జాన్వీ. అట్లీ డైరక్షన్లో ఐకాన్స్టార్ నటిస్తున్న సినిమాలో నాయికగా జాన్వీ కపూర్ ఫిక్స్ అయ్యారన్నది లేటెస్ట్ ట్రెండింగ్ న్యూస్. మరి చూడలేక ఏమి జరగనుందో.

నార్త్ భామలు ఇలా కనిపించి, అలా వెళ్లి పోతుంటే.. మా జాన్వీ పాప మాత్రం సౌత్లో పక్కాగా సెటిల్ కావాలని ఫిక్స్ అయిపోయారంటూ హ్యాపీగా ఉన్నారు అలనాటి అతిలోకసుందరి శ్రీదేవి అభిమానులు.




