- Telugu News Photo Gallery Cinema photos Prabhas salaar to actress Trisha movie updates in Tollywood films Telugu Entertainment Photos
Tollywood: వినాయకచవితి నుండి హనుమ్యాన్ రాక..| చెన్నై సుందరి త్రిష ఆన్ ది రోడ్..
ఒకప్పుడు హీరోయిన్గా ఎన్నో సినిమాలు చేసిన గౌతమి.. ఇప్పుడు అమ్మ పాత్రలకు పరిమితమయ్యారు. తాజాగా ఈమెకు చెందిన రూ.25 కోట్లు విలువైన భూమి కబ్జాకు గురైనట్లుగా ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఆమె గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి.. భూమి కబ్జాకు సంబంధించిన ఫిర్యాదు చేశారు. తన స్థలాన్ని తన కుమార్తె పేరు మీద రాసేందుకు గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆళగప్పన్ ను సంప్రదించానని..
Updated on: Sep 14, 2023 | 11:50 AM

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ సెప్టెంబర్ 28, 2023న రిలీజ్ కావల్సి ఉన్నా.. అది వాయిదా పడినట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు క్లారిటీ వచ్చింది.

సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమకు థ్యాంక్స్.. అనుకోని కారణాలతో సెప్టెంబర్ 28 నుంచి సలార్ సినిమాను వాయిదా వేస్తున్నాం.. అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసమే ఇది చేస్తున్నాం.. త్వరలోనే కొత్త డేట్ చెప్తామంటూ పోస్ట్ చేసారు మేకర్స్.

విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న లియో సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉంటే తమిళనాడులో విడుదలకు ఒక రోజు ముందు అంటే అక్టోబర్ 18న పెయిడ్ ప్రీమియర్లను ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

బెనిఫిట్ షోలకు అనుమతులు లేకపోవడంతో టీమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 19న దసరా సందర్భంగా సినిమా విడుదల కానుంది.

తేజ సజ్జ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న సోఫియో ఫాంటసీ హనుమాన్. ఈ సినిమాను 2024 సంక్రాంతికి విడుదల చేస్తామని ఇప్పటికే చెప్పారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా టీజర్కు రెస్పాన్స్ అదిరిపోయింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. వినాయక చవితి పండుగ నుంచి ప్రమోషన్స్ మొదలు కానున్నాయి.

విజయ్తో లియో కంటే ముందే మరో సినిమాతో వస్తున్నారు త్రిష. ఈమె హీరోయిన్గా నటిస్తున్న ది రోడ్ సినిమా అక్టోబర్ 6న విడుదల కానుంది. రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతోంది ఈ సినిమా. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఇప్పటి వరకు హిట్ కొట్టని త్రిష.. ఈ సినిమాతో ఆ సెంటిమెంట్ బ్రేక్ చేయాలని చూస్తున్నారు.

ఒకప్పుడు హీరోయిన్గా ఎన్నో సినిమాలు చేసిన గౌతమి.. ఇప్పుడు అమ్మ పాత్రలకు పరిమితమయ్యారు. తాజాగా ఈమెకు చెందిన రూ.25 కోట్లు విలువైన భూమి కబ్జాకు గురైనట్లుగా ఆరోపిస్తున్నారు.

ఈ విషయంపై ఆమె గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి.. భూమి కబ్జాకు సంబంధించిన ఫిర్యాదు చేశారు. తన స్థలాన్ని తన కుమార్తె పేరు మీద రాసేందుకు గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆళగప్పన్ ను సంప్రదించానని.. ఆ సందర్భంలో ఆయన తనను మోసం చేసినట్లుగా వాపోయారు.





























