వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడటం ప్రారంభమవుతాయి. ఫలితంగా మోకాలి, నడుముతో సహా వివిధ భాగాల కీళ్లలో విపరీతమైన నొప్పి మొదలవుతుంది. మొదటి నుంచి ఎముకల బలంపై తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే తర్వాత పెద్ద ఇబ్బందులు ఎదుర్కోకతప్పదు. సాధారణంగా శరీరంలో కాల్షియం లోపం వల్ల ఎముకల్లో నొప్పి వస్తుంది. ముఖ్యంగా స్త్రీలకు 40 ఏళ్లు రాగానే కాల్షియం లోపం తలెత్తుతుంది. అందువల్ల, ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి శరీరంలో కాల్షియం స్థాయిని పెంచుకోవడం చాలా అవసరం.