AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat: వందే భారత్ బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్.. కేవలం 4 గంటల్లోనే ప్రయాణం.. ఈ రూట్లోనే..

వందే భారత్ బుల్లెట్ రైళ్లను వచ్చే ఏడాదిలో వచ్చే ఏడాదిలో ప్రారంభించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. ఈ రైళ్లు అత్యంత వేగంగా ప్రయాణిస్తాయి. ప్రస్తుతం ఉన్న వందే భారత్ రైళ్ల తరహాలోనే వీటి డిజైన్ అనేది ఉంటుంది. కానీ బుల్లెట్ రైళ్ల వేగాన్ని ఇవి కలిగలి ఉంటాయి.

Venkatrao Lella
|

Updated on: Apr 26, 2026 | 6:54 PM

Share
రైల్వేశాఖ వచ్చే ఏడాదిలో బుల్లెట్ రైళ్లను తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా వందే భారత్ బుల్లెట్ రైళ్లను తీసుకురానుంది. ఇప్పటికే వందే భారత్, వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌లు ఉండగా.. ఇప్పుడు వందే భారత్ బుల్లెట్ రైళ్లను కూడా ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. గంటకు 280 కిలోమీటర్ల వేగంగా ఇవి ప్రయాణిస్తాయి. తొలి రైలు ఢిల్లీ-పాట్నా మధ్య ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు

రైల్వేశాఖ వచ్చే ఏడాదిలో బుల్లెట్ రైళ్లను తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా వందే భారత్ బుల్లెట్ రైళ్లను తీసుకురానుంది. ఇప్పటికే వందే భారత్, వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌లు ఉండగా.. ఇప్పుడు వందే భారత్ బుల్లెట్ రైళ్లను కూడా ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. గంటకు 280 కిలోమీటర్ల వేగంగా ఇవి ప్రయాణిస్తాయి. తొలి రైలు ఢిల్లీ-పాట్నా మధ్య ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు

1 / 5
ఇటీవల బెంగళూరులోని బీఈఎంఎల్ ప్లాంట్‌ను రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆదిత్య కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. ఇది ప్రత్యేక కాంప్లెక్స్ కాగా.. ఇక్కడ బీ28 అని పిలవబడే భారత్ మేడ్ బుల్లెట్ ట్రైన్ సెట్ తయారుకానుంది. ఇక్కడ హైస్పీడ్ రూళ్లు, బీ28 రైళ్లు తయారుచేస్తారు. ఈ కాంప్లెక్స్‌లో తయారయ్యే బీ28 ట్రైన్‌ సెట్‌ను వందే భారత్ బుల్లెట్ ట్రైన్‌గా పిలుస్తున్నారు.

ఇటీవల బెంగళూరులోని బీఈఎంఎల్ ప్లాంట్‌ను రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆదిత్య కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. ఇది ప్రత్యేక కాంప్లెక్స్ కాగా.. ఇక్కడ బీ28 అని పిలవబడే భారత్ మేడ్ బుల్లెట్ ట్రైన్ సెట్ తయారుకానుంది. ఇక్కడ హైస్పీడ్ రూళ్లు, బీ28 రైళ్లు తయారుచేస్తారు. ఈ కాంప్లెక్స్‌లో తయారయ్యే బీ28 ట్రైన్‌ సెట్‌ను వందే భారత్ బుల్లెట్ ట్రైన్‌గా పిలుస్తున్నారు.

2 / 5
స్వదేశీ టెక్నాలజీతో ఈ వందే భారత్ బుల్లెట్ ట్రైన్‌ను అభివృద్ది చేస్తున్నారు. ఈ ట్రైన్ చూడటానికి వందే భారత్ రైలు తరహాలో ఉంటుంది. కానీ బుల్లెట్ రైలు వేగాన్ని పోలి ఉంటుంది. దీని వల్ల ఈ రైలుకు వందే భారత్ బుల్లెట్ ట్రైన్‌గా పిలుస్తున్నారు. ఈ ట్రైన్ తయారీని వేగవంతం చేయాలని అధికారులు భావిస్తున్నారు. వచ్చే ఏడాదికల్లా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.

స్వదేశీ టెక్నాలజీతో ఈ వందే భారత్ బుల్లెట్ ట్రైన్‌ను అభివృద్ది చేస్తున్నారు. ఈ ట్రైన్ చూడటానికి వందే భారత్ రైలు తరహాలో ఉంటుంది. కానీ బుల్లెట్ రైలు వేగాన్ని పోలి ఉంటుంది. దీని వల్ల ఈ రైలుకు వందే భారత్ బుల్లెట్ ట్రైన్‌గా పిలుస్తున్నారు. ఈ ట్రైన్ తయారీని వేగవంతం చేయాలని అధికారులు భావిస్తున్నారు. వచ్చే ఏడాదికల్లా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.

3 / 5
మరోవైపు కాంప్లెక్స్ ప్రారంభోత్సవం అనంతరం అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడారు. బీ28 బుల్లెట్ రైలు అనేది స్వయం సమృద్ది గల వెర్షన్ అని, బీఈఎంఎల్, ఐసిఎఫ్ సంయుక్తంగా డిజైన్ చేశాయన్నారు. బీఈఎంఎల్‌లోనే దీని తయారీ జరుగుతుందని, బుల్లెట్ రైళ్ల తయారీ కోసమే ప్రత్యేకంగా ఆదిత్య కాంప్లెక్స్ రూపొందించామన్నారు. ఇక్కడ అత్యాధునిక యంత్రాలు ఉంటాయని, అవి అత్యంత ఖచ్చితత్వంతో పని చేస్తాయన్నారు. దీనికి అనుగుణంగానే ఇక్కడ పనులు జరుగుతాయని స్పష్టం చేశారు.

మరోవైపు కాంప్లెక్స్ ప్రారంభోత్సవం అనంతరం అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడారు. బీ28 బుల్లెట్ రైలు అనేది స్వయం సమృద్ది గల వెర్షన్ అని, బీఈఎంఎల్, ఐసిఎఫ్ సంయుక్తంగా డిజైన్ చేశాయన్నారు. బీఈఎంఎల్‌లోనే దీని తయారీ జరుగుతుందని, బుల్లెట్ రైళ్ల తయారీ కోసమే ప్రత్యేకంగా ఆదిత్య కాంప్లెక్స్ రూపొందించామన్నారు. ఇక్కడ అత్యాధునిక యంత్రాలు ఉంటాయని, అవి అత్యంత ఖచ్చితత్వంతో పని చేస్తాయన్నారు. దీనికి అనుగుణంగానే ఇక్కడ పనులు జరుగుతాయని స్పష్టం చేశారు.

4 / 5
వందే భారత్ బుల్లెట్ రైలు బెంగళూరు నుంచి చెన్నైకు 73 నిమిషాల్లో చేరుకుంటుంది. ఈ రెండు నగరాల మధ్య 353 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక ఢిల్లీ నుంచి పాట్నా మధ్య దూరం వెయ్యి కిలోమీటర్లు ఉంటుంది. ఈ రెండు నగరాల మధ్య కేవలం నాలుగు గంటల్లోనే చేరుకోగలదు.

వందే భారత్ బుల్లెట్ రైలు బెంగళూరు నుంచి చెన్నైకు 73 నిమిషాల్లో చేరుకుంటుంది. ఈ రెండు నగరాల మధ్య 353 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక ఢిల్లీ నుంచి పాట్నా మధ్య దూరం వెయ్యి కిలోమీటర్లు ఉంటుంది. ఈ రెండు నగరాల మధ్య కేవలం నాలుగు గంటల్లోనే చేరుకోగలదు.

5 / 5
Follow Us