EV Cars: మార్కెట్లో దుమ్ము రేపుతున్న ఈవీ కార్లు.. ఈ ఏడాది రిలీజయ్యే కార్లు ఇవే..!
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్తో రోజురోజుకూ అభివృద్ధి చెందుతుంది. దీంతో అన్ని కంపెనీలు సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి. అయితే ఈవీ మార్కెట్లో స్కూటర్లతో పోల్చుకుంటే కార్లు పెద్దగా ప్రజాదరణ పొందలేదు. కానీ ఇటీవల కాలంలో ఈవీ కార్లల్లో వచ్చే సమస్యలకు చెక్ పెడుతూ సూపర్ మైలేజ్తో ఈవీ కార్లు మార్కెట్లోకి కార్లు క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలో రాబోయే ఎలక్ట్రిక్ కార్లలో మారుతీ సుజుకీ ఈవీఎక్స్ తొలి ఈవీగా చాలా సంచలనం సృష్టిస్తోంది. అలాగే టాటా మోటార్స్, కియా, హ్యుందాయ్ ఈ సంవత్సరం కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2024లో భారతదేశంలో విడుదలయ్యే అవకాశం ఉన్న ఈవీ కార్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
Most Read Stories