- Telugu News Photo Gallery Business photos Post office special scheme save 5000 rupees every month get 8 lakh on maturity
Post office: కేవలం రూ.5000 ఆదా చేస్తే రూ.8 లక్షలు పొందవచ్చు.. అద్భుతమైన స్కీమ్!
Post Office Scheme: పోస్టాఫీసులలో రకరకాల పథకలు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు కేవలం ఉత్తరాలకే పరిమితమైన పోస్టాఫీసులు.. ఇప్పుడు ప్రజలకు మంచి రాబడి అందించే పథకాలను ప్రవేశపెడుతున్నాయి. పోస్టల్ శాఖలో ప్రవేశపెడుతున్న పథకాల్లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి. ఇందులో మంచి రాబడి పొందవచ్చు..
Updated on: Jan 25, 2025 | 6:37 PM

పోస్ట్ ఆఫీస్ 2025 MIS పథకం గురించి తెలుసుకుందాం. ఈ పథకంలో డబ్బు జమ చేస్తే మీకు ప్రతి నెలా రూ.18,350 ఆదాయం వస్తుంది. మరి 2025 మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (MIS) పథకంలో ఎవరు పెట్టుబడి పెట్టవచ్చో పూర్తి వివరాలు తెలుసుకుందాం..

గత సంవత్సరం, 2023లో, పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ వడ్డీ రేట్లను పెంచడం ద్వారా ప్రభుత్వం పెట్టుబడిదారులకు ప్రత్యేక బహుమతిని ఇచ్చింది. కొత్త వడ్డీ రేటు అక్టోబర్-డిసెంబర్ మూడు నెలలకు వర్తిస్తుంది ఈ పథకంలో పెట్టుబడిపై వడ్డీ రేటు 6.7 శాతంగా ఉంది. ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి పోస్టాఫీసు మైక్రో సేవింగ్స్ స్కీమ్పై వడ్డీ రేట్లను సవరిస్తుంది. ఈ పథకం చివరిసారిగా సెప్టెంబర్ 29న సవరించబడింది.


ఈ ఆర్డీ ఖాతాను మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. తదుపరి ఐదు సంవత్సరాలకు పొడిగిస్తే 10 సంవత్సరాలలో మీ డిపాజిట్ రూ. 6,00,0 అదనంగా, డిపాజిట్పై వడ్డీ 6.7 శాతం చొప్పున రూ.2,54,272 అవుతుంది. ఈ లెక్కన, 10 సంవత్సరాలలో డిపాజిట్ చేసిన మీ మొత్తం మూలధనం రూ. 8,54,272.

ఏ భారతీయ పౌరుడైనా ఈ పోస్టాఫీసు పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. కానీ అతని వయస్సు 18 సంవత్సరాలు కంటే ఎక్కువ ఉండాలి. మీరు మైనర్ పేరు మీద పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు ఉమ్మడి ఖాతాను తెరిచి పెట్టుబడి పెట్టవచ్చు. పోస్ట్ ఆఫీస్ MIS పథకంలో గరిష్టంగా 3 మంది పెద్దలు ఉమ్మడి ఖాతా తెరవడం ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు.




