రియల్ హీరో, రైలు కింద పడిపోబోయిన చిన్నారిని రక్షించిన రైల్వే ఉద్యోగి, ఎక్కడంటే?
ఒక్కోసారి రియల్ హీరోలు మన కళ్ళ ముందే కనిపిస్తుంటారు. వారి సమయ స్ఫూర్తి, ధైర్య సాహసాలకు విలువ కట్టలేం.. ముంబై డివిజన్ లోని సెంట్రల్ రైల్వేలో పని చేసే మయూర్ షేక్ అనే ఉద్యోగి (పాయింట్స్ మన్) విషయానికే వద్దాం..
ఒక్కోసారి రియల్ హీరోలు మన కళ్ళ ముందే కనిపిస్తుంటారు. వారి సమయ స్ఫూర్తి, ధైర్య సాహసాలకు విలువ కట్టలేం.. ముంబై డివిజన్ లోని సెంట్రల్ రైల్వేలో పని చేసే మయూర్ షేక్ అనే ఉద్యోగి (పాయింట్స్ మన్) విషయానికే వద్దాం.. ఈ నెల 17 న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ముంబైలోని వంగానీ రైల్వే స్టేషన్ లో జరిగింది ఓ ఘటన.. ఈ స్టేషన్ లో ఓ మహిళ తన చిన్నారితో కలిసి ప్లాట్ ఫామ్ పై నడుస్తుండగా ఆ బాలుడు కాలు జారీ కింద రైల్వే ట్రాక్ పై పడిపోయాడు. అప్పటికే శరవేగంగా ఓ సబర్బన్ రైలు వస్తోంది. ఇది చూసిన మయూర్ షేక్ పరుగున పరుగున వచ్చి ఆ బాలుడిని ప్లాట్ ఫామ్ పైకి విసిరివేసినంత పని చేశాడు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ చిన్నారిని రక్షించాడు. అతడు ఏమాత్రం ఇలా సమయస్ఫూర్తి చూపకపోయినా ఆ చిన్నారి రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయేవాడే.. ఈ ఘటన అంతా సీసీటీవీ ఫుటేజీలో రికార్డాయింది. మయూర్ షేక్ ధైర్య సాహసాలను, డ్యూటీ పట్ల అతని అంకిత భావాన్ని రైల్వే శాఖ అధికారులు ప్రశంసలతో ముంచెత్తారు.
A Good Samaritan:
At Vangani station of Central Railway, Pointsman Mr. Mayur Shelkhe saved the life of a child just in the nick of the time. He risked his life to save the life of the child.
We salute his exemplary courage & utmost devotion to the duty. pic.twitter.com/V6QrxFIIY0
— Ministry of Railways (@RailMinIndia) April 19, 2021