AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zydus Vaccine: గుడ్ న్యూస్.. 18 ఏళ్లలోపు వారికి సెప్టెంబర్ నుంచి వ్యాక్సినేషన్.!

సెప్టెంబర్-అక్టోబర్ మధ్య థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండటంతో కేంద్రం దానికి తగిన చర్యలు తీసుకుంటోంది..

Zydus Vaccine: గుడ్ న్యూస్.. 18 ఏళ్లలోపు వారికి సెప్టెంబర్ నుంచి వ్యాక్సినేషన్.!
Covid Vaccine
Ravi Kiran
|

Updated on: Jul 09, 2021 | 9:58 AM

Share

సెప్టెంబర్-అక్టోబర్ మధ్య థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండటంతో కేంద్రం దానికి తగిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపధ్యంలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. అలాగే 18 ఏళ్లలోపు వారికి కూడా వ్యాక్సిన్ వేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ తరుణంలోనే ఓ గుడ్ న్యూస్ అందించింది.

12 నుంచి 18 ఏళ్ల వయస్సు ఉన్నవారికి జైడస్ వ్యాక్సిన్‌ను సెప్టెంబర్ నుంచి ప్రారంభిస్తామని డాక్టర్ ఎన్‌కె అరోరా వెల్లడించారు. ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన పలు కీలక విషయాలను వివరించారు. రాబోయే వారాల్లో అత్యవసర వినియోగానికి జైడస్ వ్యాక్సిన్‌కు అనుమతులు వస్తాయని ఆయన అన్నారు.

ప్రస్తుతం పిల్లలపై కోవాగ్జిన్ మూడోదశ క్లినికల్ ట్రయిల్స్ జరుగుతున్నాయి. జైడస్ వ్యాక్సిన్ ఫేజ్-3 ట్రయల్స్ కూడా సెప్టెంబర్ నాటికి పూర్తి చేసి.. అనుమతులు లభించిన తర్వాత సెప్టెంబర్ నుంచి 12-18 మధ్య వయస్సువారికి, అలాగే 2022 జనవరి లేదా ఫిబ్రవరి నుంచి 2-18 ఏళ్ల వయస్సువారికి వ్యాక్సినేషన్ ప్రక్రియను మొదలు పెట్టేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా పాఠశాలల పున: ప్రారంభం, ఇతరత్రా అంశాలను దృష్టిలో పెట్టుకుని క్లినికల్ ట్రయిల్స్‌ను వేగవంతం చేస్తున్నామన్నారు.

ఇదిలా ఉంటే నిపుణుల విభాగంతో పాటు దేశ పీడియాట్రిక్ అసోషియేషన్ థర్డ్ వేవ్‌పై అంచనాలు తప్పు కావచ్చునని.. పిల్లలు సురక్షితంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ తలెత్తకుండా ఉండేలా ప్రభుత్వం పక్కాగా చర్యలు చేపడుతోంది. ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా.. దేశవ్యాప్తంగా ఉన్న 736 జిల్లాల్లో పిల్లల కోసం పీడియాట్రిక్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ప్యాకేజీని తొమ్మిది నెలల్లో అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అటు ఢిల్లీ, మహారాష్ట్రలతో సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసే పనిలో ఉన్నారు.

Also Read:

రాత్రుళ్లు కోళ్లు మాయం.. బోను ఏర్పాటు చేయగా.. చిక్కిన జంతువును చూసి రైతు షాక్.!

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అమలులోకి కొత్త రూల్.. గంటలో రూ. 1 లక్ష విత్‌డ్రా!

మొసలి, సింహాల భీకర పోరు.. గెలిచిందెవరు.? ఈ షాకింగ్ వీడియో మీకోసమే!

పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!