కేంద్ర మంత్రి ఇంట్లో యువకుడి డెడ్ బాడీ.. వెంటాడుతున్న అనుమానం
కాల్పులు జరగడంతో చనిపోయినట్లుగా తెలుస్తోంది. మృతి చెందిన యువకుడు కేంద్రమంత్రి కొడుకు స్నేహితుడి కొడుకుకు మిత్రుడిగా గుర్తించారు పోలీసులు. హత్యానంతరం కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి అండగా ఉన్నామన్నారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

కేంద్రమంత్రి కౌశల్ కిశోర్ ఇంట్లో ఓ యువకుడి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని కేంద్ర మంత్రి కొత్త ఇంట్లో ఈ ఘటన వెలుగు చూసింది. కాల్పులు జరగడంతో చనిపోయినట్లుగా తెలుస్తోంది. మృతి చెందిన యువకుడు కేంద్రమంత్రి కొడుకు స్నేహితుడి కొడుకుకు మిత్రుడిగా గుర్తించారు పోలీసులు. హత్యానంతరం కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి అండగా ఉన్నామన్నారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
అదే సమయంలో, కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ కుమారుడు వికాస్ కిషోర్ హత్యకు కుట్ర పన్నాడని మృతుడి సోదరుడు ఆరోపించడం సంచలనంగా మారింది. మృతుడి సోదరుడు వికాస్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. తన సోదరుడు ఎప్పుడూ మంత్రి కుమారుడితోనే ఉండేవాడని .. అతను అతని రైడ్ హ్యాండ్ అని అన్నాడు. నా సోదరుడు ఎప్పుడూ వికాస్ కిషోర్తో కలిసి ఉండేవాడు. రోజూ రాత్రి ఆలస్యంగా వచ్చేవాడు.
అతను గురువారం రాత్రి రావడానికి ఆలస్యం కావడంతో.. తాము అతనికి ఫోన్ చేసాం. అనంతరం మంత్రి ఇంటికి చేరుకుని చూడగా ఆయన చొక్కా బటన్లు ఉడిపోయి.. గుడ్డలు చిరిగిపోయి.. రక్తం మడుగులో పడి ఉన్నాడు. అక్కడే పోలీసులకు కాల్చిన రివాల్వర్ బుల్లెట్ కూడా లభ్యమైందన్నారు. వికాస్ కిషోర్ వద్ద లైసెన్స్ రివాల్వర్ ఉందని ఆరోపించారు. ఘటనా స్థలంలో ఉన్న అంకిత్, సమీమ్, అజయ్ ఆత్మహత్యగా అభివర్ణించారని.. అయితే అక్కడి పరిస్థితి చూస్తుంటే అలా అనిపించడం లేదన్నారు. నా సోదరుడు హత్యకు గురయ్యాడు. ఇందులో ప్రమేయం ఉన్నవారిని కఠినంగా శిక్షించాలి. తమ్ముడిని చంపిన వారెవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని డిమాండ్ చేశారు.
VIDEO | “A boy named Vinay Srivastava was shot dead due to bullet injury. A total of six persons came to the house last night, had dinner and after the incident took place. We have recovered a pistol which is said to be of Vikas Kishore. We are investigating the matter. The… pic.twitter.com/eVRVt7CD4F
— Press Trust of India (@PTI_News) September 1, 2023
కౌశల్ కిషోర్ ఏమన్నారు?
నిందితులందరినీ మంత్రి కౌశల్ కిషోర్ తప్పుగా చెప్పినప్పటికీ అది చేసిన పిస్టల్ మంత్రి కుమారుడిది. ఘటన జరిగినప్పుడు వికాస్ అంటే అతని కొడుకు ఇంట్లో లేడని మంత్రి కౌశల్ కిషోర్ అంటున్నారు. బుల్లెట్ ఎవరి పిస్టల్ నుంచి పేలింది అనేది విచారణలో ఉంది. ఈ హత్య గురించి తెలుసుకున్న మంత్రి కౌశల్ కిశోర్.. కమిషనర్కు సమాచారం అందించారు. పోలీసు విచారణలో ఈ హత్య గురించి నిజానిజాలు వెలుగులోకి రావాలని అన్నారు మంత్రి. ఈ ఘటన సమయంలో తాను, తన కుమారుడు కూడా ఘటనాస్థలిలో లేడని.. అనారోగ్యంగా ఉన్న కారణంగా ఢిల్లీలో ఉన్నాడని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం