Tea: నాడు తన కడుపు కాల్చుకుని బిడ్డల ఆకలి తీర్చింది.. కట్‌చేస్తే 50 ఏళ్లుగా కేవలం టీ మాత్రమే తాగుతూ..

ఒకప్పుడు బిడ్డల కడుపు నింపడానికి కాసిన్ని టీనీళ్లు తాగి ఆకలిని చంపుకుంది. ఆ తర్వాత కూడా అదే అలవాటుగా మారింది. దీంతో గత 50 ఏళ్లుగా ఓ మహిళ కేవలం టీ మాత్రమే తాగుతూ జీవనం సాగిస్తోంది. వివరాల్లోకెళ్తే..

Tea: నాడు తన కడుపు కాల్చుకుని బిడ్డల ఆకలి తీర్చింది.. కట్‌చేస్తే 50 ఏళ్లుగా కేవలం టీ మాత్రమే తాగుతూ..
West Bengal News
Follow us

|

Updated on: Jan 21, 2023 | 5:33 PM

ఒకప్పుడు బిడ్డల కడుపు నింపడానికి కాసిన్ని టీనీళ్లు తాగి ఆకలిని చంపుకుంది. ఆ తర్వాత కూడా అదే అలవాటుగా మారింది. దీంతో గత 50 ఏళ్లుగా ఓ మహిళ కేవలం టీ మాత్రమే తాగుతూ జీవనం సాగిస్తోంది. వివరాల్లోకెళ్తే..

పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా, సియామ్ బజార్ పంచాయతీ పరిధిలోని బెల్డియా గ్రామానికి చెందిన అనిమా చక్రవర్తి (76) అనే వృద్ధురాలికి కొడుకు, మనుమలు ఉన్నారు. చిన్నవయసులో కుటుంబ ఆర్థిక పరిస్థితుల రిత్యా ఇళ్లలో పాచిపనులు చేసుకుంటూ వచ్చిన ఆదాయంతో కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేది. ఆ సమయంలో పని ప్రదేశంలో మిగిలిపోయిన ఆహారాన్ని తన పిల్లల కోసం తీసుకొచ్చి వాళ్ల కడుపు నింపేది. ఆ తర్వాత తనకు తినడానికి ఏమీ మిగలేది కాదు. దీంతో తన ఆకలిని తీర్చుకోవడానికి టీ లేదా ఇతర పానీయాలతో కడుపు నింపుకునేది. ఆ తర్వాత ఇళ్లలో పని మానేసినా ఆమె ఆహార అలవాట్లు మాత్రం మారలేదు. దాదాపు యాభై ఏళ్లుగా ఆహారం తీసుకోకుండా కేవలం టీ మాత్రమే సేవిస్తూ జీవనం సాగిస్తోంది. ఈ విషయం తన గ్రామంలోని ఇతరులకు ఎవ్వరికీ తెలియదు. తాజాగా ఈ విషయం బయటపడగానే అందరూ అమితాశ్చర్యాలకు గురయ్యారు. ప్రస్తుతం అనిమా ఆరోగ్యంగానే ఉంది.

వైద్యులు ఏం చెబుతున్నారంటే.. ఆరోగ్యంగా జీవించాలంటే ఘనాహారం మాత్రమే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆసుపత్రుల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లలోని రోగులకు ఏళ్లతరబడి ద్రవ రూపంలో మాత్రమే పోషకాలను అందిస్తారు. వారు ఆరోగ్యంగా కోలుకునేందుకు శరీరానికి కావల్సిన పోషకాలను లిక్విడ్ రూపంలో అందించడం జరుగుతుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు