AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vivek Bindra: పెళ్లయిన గంటల వ్యవధిలోనూ భార్యపై పైశాచిక దాడి.. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడిపై కేసు!

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సరుగా లక్షలాది ఫాలోవర్లు ఉన్న వివేక్‌ బింద్రా (41)పై నోయిడాలో గృహహింస కేసు నమోదైంది. వివాహం జరిగిన గంటల వ్యవధిలోనే తన భార్యను దారుణంగా కొట్టాడు. దీంతో నోయిడా సెక్టార్ 126లో అతని బావమరిది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 6న బింద్రా, యానికాల వివాహం జరిగింది..

Vivek Bindra: పెళ్లయిన గంటల వ్యవధిలోనూ భార్యపై పైశాచిక దాడి.. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడిపై కేసు!
Motivation Speaker Vivek Bindra
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 24, 2023 | 9:10 AM

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 24: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సరుగా లక్షలాది ఫాలోవర్లు ఉన్న వివేక్‌ బింద్రా (41)పై నోయిడాలో గృహహింస కేసు నమోదైంది. వివాహం జరిగిన గంటల వ్యవధిలోనే తన భార్యను దారుణంగా కొట్టాడు. దీంతో నోయిడా సెక్టార్ 126లో అతని బావమరిది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 6న బింద్రా, యానికాల వివాహం జరిగింది. వీరిద్దరూ నొయిడాలోని సెక్టార్‌ 94లో కొత్తకాపురం ప్రారంభించారు. ఆ మర్నాడే అంటే డిసెంబర్ 7వ తేదీ తెల్లవారుజామున బింద్రా, అతని తల్లి ప్రభ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవ మధ్యలో భార్య యానికా కల్పించుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేసింది.

దీంతో కోపోధ్రిక్తుడైన బింద్రా తన భార్య యానికాను ఒక గదిలోకి లాక్కుపోయి అసభ్యపదజాలంతో దూషిస్తూ, జుట్టుపట్టి లాగి దారుణంగా కొట్టాడు. ఈ దాడిలో యానికా శరీరంపై లోతైన గాయాలు తగిలామి. బింద్రా తన ఫోన్‌ కూడా పగలగొట్టాడు. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బింద్రా భార్య మానికా సోదరుడు వైభవ్‌ క్వాత్రా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దాడిలో తన సోదరి యానికా వినికిడి శక్తి కోల్పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

హై-ప్రొఫైల్ ఇండియన్ మోటివేషనల్ స్పీకర్, యూట్యూబర్ సందీప్ మహేశ్వరి తెలిపిన వివరాల ప్రకారం.. ‘బడా బిజినెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ (BBPL)’ వ్యవస్థాపకుడైన బింద్రా ఈ కంపెనీ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఆయన వ్యక్తిత్వ వికాస ప్రసంగాలను ఇన్‌స్టా, యూట్యూబ్‌ ఛానల్‌లో మిలియన్ల ఫాలోవర్లు అవుతున్నారు. ఇందులో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. మహేశ్వరి తన యూట్యూబ్ ఛానెల్‌లో “బిగ్ స్కామ్ ఎక్స్‌పోజ్” పేరుతో ఒక వీడియోను విడుదల చేశాడు. దీనిలో బింద్రా కంపెనీ వల్ల మోసపోయిన పలువురు విద్యార్థులు పలు ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలన్నింటినీ బింద్రా ఖండించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.