AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ‘ఇదేందయ్యా ఇదీ.. నేనెక్కడా చూడలా! లోకోపైలెట్‌ నిద్రపోయినాడా ఏందీ’ ప్లాట్‌ ఫాంపైకి దూసుకొచ్చిన ట్రైన్‌!

సాధారణంగా ట్రైన్ పట్టాలు తప్పడం, రెండు రైళ్లు ఒకదాన్ని మరొకటి ఢీ కొట్టుకోవడం, మరొకడుగు ముందుకేసి ట్రైన్ బోగాలు పల్టీలు కొట్టడం మనం ఇంత వరకూ చూశాం. కానీ ఇది అంతకు మించిన సంఘటన. రైలు పట్టాల మీద నుంచి ఫ్లాట్ ఫాం మీదకు దూసుకు రావడం ఎప్పుడైనా చూశారా? అదేంటీ.. అని అనుకుంటున్నారా? ఉత్తర ప్రదేశ్‌లో ఓ ట్రైన్‌ పట్టాల మీద నుంచి ఏకంగా ప్లాట్‌ఫాం మీదకు ఓ ట్రైన్‌ దూసుకొచ్చింది. అయితే ఆ సమయంలో ట్రైన్‌లో ప్యాసెంజర్లు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అసలిది ఎలా జరిగిందో తమకు ఏమాత్రం..

Viral Video: 'ఇదేందయ్యా ఇదీ.. నేనెక్కడా చూడలా! లోకోపైలెట్‌ నిద్రపోయినాడా ఏందీ' ప్లాట్‌ ఫాంపైకి దూసుకొచ్చిన ట్రైన్‌!
Train Climbs Platform
Srilakshmi C
|

Updated on: Sep 27, 2023 | 10:18 AM

Share

మధుర, సెప్టెంబర్‌ 27: సాధారణంగా ట్రైన్ పట్టాలు తప్పడం, రెండు రైళ్లు ఒకదాన్ని మరొకటి ఢీ కొట్టుకోవడం, మరొకడుగు ముందుకేసి ట్రైన్ బోగాలు పల్టీలు కొట్టడం మనం ఇంత వరకూ చూశాం. కానీ ఇది అంతకు మించిన సంఘటన. రైలు పట్టాల మీద నుంచి ఫ్లాట్ ఫాం మీదకు దూసుకు రావడం ఎప్పుడైనా చూశారా? అదేంటీ.. అని అనుకుంటున్నారా? ఉత్తర ప్రదేశ్‌లో ఓ ట్రైన్‌ పట్టాల మీద నుంచి ఏకంగా ప్లాట్‌ఫాం మీదకు ఓ ట్రైన్‌ దూసుకొచ్చింది. అయితే ఆ సమయంలో ట్రైన్‌లో ప్యాసెంజర్లు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అసలిది ఎలా జరిగిందో తమకు ఏమాత్రం తెలియదంటున్నారు రైల్వే అధికారులు. యూపీలో చోటుచేసుకున్న ఈ విచిత్ర సంఘటన ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. అసలేం జరిగిందంటే..

ఉత్తర ప్రదేశ్‌లోని మధుర రైల్వే స్టేషన్‌లో ఈ రైలు ప్రమాదం జరిగింది. షకుర్ బస్తీ నుంచి వచ్చిన ఈఎంయూ (ఎలక్ట్రిక్‌ మల్టిపుల్‌ యూనిట్‌) రైలు మంగళవారం రాత్రి 10:49 గంటల సమయంలో మధుర స్టేషన్‌కు వచ్చింది. అదే చివరి స్టేషన్‌ కావడంతో ప్రయాణీకులందరూ రైలు దిగారు. అయితే ఉన్నట్టుండి ఏం జరిగిందో తెలియదు.. ఒక్కసారిగా రైలు ఫ్లాట్ ఫామ్ పైకి దూసుకువెళ్లింది. అయితే అప్పటికే ట్రైన్‌లో ప్రయాణికులందరూ దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊరిపి పీల్చుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని మధుర స్టేషన్ డైరెక్టర్ SK శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ ప్రమాదం ఎలా జరిగిందో ఇంకా అర్థం కావడం లేదు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. ఢిల్లీ నుంచి రాత్రి 11:49 గంటలకు మథుర జంక్షన్ వద్దకు రైలు చేరుకున్న 5 నిమిషాలకు ఈ సంఘటన జరిగింది. ఓవర్ హెడ్ ఎక్విప్‌మెంట్‌ను బద్దలు కొట్టుకొని ట్రైన్‌ ఫ్లాట్ ఫామ్ పైకి దూసుకు వచ్చింది. దీంతో ఫ్లాట్ ఫామ్ స్వల్పంగా దెబ్బతిందని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వీడియోను వీక్షించిన కొందరు నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అంత బరువైన ట్రైన్ మహా అయితే పట్టాల నుంచి కొద్దిగ పక్కకు తప్పుతుంది. అంతేకానీ ఏకంగా ఎతైన ఫ్లాట్ ఫామ్ మీదకి ఎలా ఎక్కుతుంది. బైక్ ముందు టైర్ పైకెత్తి విన్యాసాలు చేసినట్లు లోకో ఫైలెట్ కూడా అలా ఏదైనా స్టంట్‌ చేసినాడా ఏందీ..! అంటూ ఛలోక్తులు విసురుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం