AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: జైల్లో ఆకస్మిక తనిఖీలు.. ఖైదీల గదిలో కనిపించిన పార్శిల్.. దాన్ని ఓపెన్ చేసిన అధికారులు షాక్

ఉన్నతాధికారులు జైల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. కొందరు ఖైదీలు ఉన్న గదిలో చిన్న పార్శిల్ కనిపించింది. దాన్ని ఓపెన్ చేసి చూసిన అధికారులు స్టన్ అయ్యారు.

Viral: జైల్లో ఆకస్మిక తనిఖీలు.. ఖైదీల గదిలో కనిపించిన పార్శిల్.. దాన్ని ఓపెన్ చేసిన అధికారులు షాక్
Vellore Prison
Ram Naramaneni
|

Updated on: Jun 15, 2022 | 1:47 PM

Share

Tamil Nadu: ఈ వార్త చదవి మీరు కచ్చితంగా స్టన్ అవుతారు. ఇప్పటివరకు రకరకాల మార్గాల్లో గంజాయి, డ్రగ్స్ తరలించేందుకు ప్రయత్నించి పట్టుబడ్డ వాళ్లని చూశాం. కానీ ఊహించని విధంగా జైల్లోని ఖైదీల వద్ద గంజాయి లభించింది. అది వారికి అందేలా చేసింది కూడా ఓ వార్డర్. అవును.. పైకం పుచ్చుకుని పెద్ద మనిషి ఈ పని చేశాడు.  జైలు ఖైదీల నుంచి లంచం తీసుకుని వారికి గంజాయి, మొబైల్ ఫోన్, బ్యాటరీలు సరఫరా చేశారన్న ఆరోపణలపై వేలూరు(Vellore)లోని సెంట్రల్ జైలు హెడ్ వార్డర్ ఎస్.విజయకుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. సెంట్రల్ జైలు హెడ్ వార్డర్‌పై ఆరోపణలు గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. హెడ్ ​​కానిస్టేబుల్ హోదాలో ఉన్న విజయకుమార్‌ను సెంట్రల్ జైలు (వెల్లూర్) ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్ ఎ. అబ్దుల్ రెహమాన్ సస్పెండ్ చేశారు. అతనిపై తదుపరి శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జైలు అధికారులను.. సూపరింటెండెంట్  ఆదేశించారు. జైలులో నిఘాను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు. కొద్ది రోజుల క్రితం ఖైదీల గదుల్లో ఆకస్మిక తనిఖీలు చేయగా ఓ మూలన దాచిన చిన్న పార్శిల్ దొరికింది. దాన్ని ఓపెన్ చేయగా 150 గ్రాముల గంజాయి ఉంది.  ఆ పక్కనే సెల్‌ఫోన్, బ్యాటరీలు కూడా దొరికాయి. ఖైదీలను విచారించగా విజయకుమార్ బాగోతం బయటపడింది. అతడు లంచం తీసుకుంటూ గత కొన్ని నెలలుగా ఖైదీలకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు తేలింది. దీనిపై బాగాయం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. ప్రస్తుతం, వేలూరు సెంట్రల్ జైలు కాంప్లెక్స్‌లో మొత్తం 1,350 మంది ఖైదీలు ఉన్నారు. ఇందులో 150 మంది మహిళా ఖైదీలు ఉన్నారు.

మరిన్ని జాతీయవార్తల కోసం క్లిక్ చేయండి..