AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Express: వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు మరోసారి ప్రమాదం.. ఇంజన్‌ ముందు భాగం ధ్వంసం.. ఈసారి కూడా కారణమదే..

ముంబై నుంచి గుజరాత్‌కు వస్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ వరుసగా రెండో రోజు కూడా ప్రమాదానికి గురయ్యింది. కంజరి-ఆనంద్‌ స్టేషన్‌ మధ్య పశువులను వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది.

Vande Bharat Express: వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు మరోసారి ప్రమాదం.. ఇంజన్‌ ముందు భాగం ధ్వంసం.. ఈసారి కూడా కారణమదే..
Vande Bharat Express
Shiva Prajapati
|

Updated on: Oct 07, 2022 | 8:36 PM

Share

ముంబై నుంచి గుజరాత్‌కు వస్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ వరుసగా రెండో రోజు కూడా ప్రమాదానికి గురయ్యింది. కంజరి-ఆనంద్‌ స్టేషన్‌ మధ్య పశువులను వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. దీంతో ఇంజన్‌ ముందుభాగం ధ్వంసం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. గురువారం కూడా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురయ్యింది.నిన్న గుజరాత్‌ లోని వాత్వా స్టేషన్‌ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఇంజన్‌ ముందు భాగం ఈ ప్రమాదంలో ధ్వంసమయ్యింది. ఈ ప్రమాదంలో నాలుగు గేదెలు చనిపోయాయి.

గురువారం ప్రమాదానికి గురైన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇంజన్‌ ముందు భాగాన్ని ముంబైలో యుద్ద ప్రాతిపదికన రిపేర్‌ చేశారు. డ్యామేజ్‌ జరిగిన భాగాలను తొలగించారు. మళ్లీ కొత్త విడి భాగాలను అమర్చారు. కాని ఇవాళ మరోసారి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురికావడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రధాని మోడీ ప్రారంభించిన వారానికే ఈ ట్రైన్ రెండుసార్లు ప్రమాదానికి గురికాడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గురువారం నాడు రైలు వేగంగా వెళ్తున్న క్రమంలో గేదెల గుంపు అడ్డం రావడంతో లోకో పైలట్‌ సడెన్‌ బ్రేక్ వేశారు. దీంతో ఇంజన్‌ ముందు భాగం దెబ్బతింది. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ముంబై సెంట్రల్‌ నుంచి గుజరాత్‌ లోని గాంధీనగర్‌కు వస్తున్న సమయంలో వాత్వా స్టేషన్‌ దగ్గర ఉదయం 11.15 గంటలకు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇంజన్‌ ముందు భాగం మాత్రమే ధ్వంసం కాగా.. అడ్డొచ్చిన నాలుగు గేదెలు చనిపోయాయి.

ఇవి కూడా చదవండి

కాగా.. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి కారణమైన గేదెల యాజమానులపై కేసు నమోదయ్యింది. గుజరాత్‌ ఆర్‌పీఎఫ్‌ పోలీసులు గేదెల యాజమానులపై కేసు నమోదు చేశారు. గుజరాత్‌లోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పశువుల యజమానులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించింది. గేదెల యజమానులను రైల్వే పోలీసులు ఇంతవరకు గుర్తించలేకపోయారని.. అందుకోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అహ్మదాబాద్‌లోని వత్వ – మణినగర్ రైల్వే స్టేషన్ల మధ్య వందే భారత్ రైలుకు అడ్డొచ్చిన గేదెల (గుర్తు తెలియని) యజమానులపై ఆర్‌పిఎఫ్ కేసు నమోదు చేసిందని.. డబ్ల్యుఆర్ సీనియర్ ప్రతినిధి (అహ్మదాబాద్ డివిజన్) జితేంద్ర కుమార్ జయంత్ వార్త సంస్థ పీటీఐకి తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
వామ్మో.. ఒక్క కోడిగుడ్డు ధర రూ.25,000.. దీని వెనుక ఉన్న సీక్రెట్
వామ్మో.. ఒక్క కోడిగుడ్డు ధర రూ.25,000.. దీని వెనుక ఉన్న సీక్రెట్
ఓరీ దేవుడో ఇదో సైలెంట్ కిల్లర్.. కాటు వేస్తే కాటికే..! ఈ లక్షణాలు
ఓరీ దేవుడో ఇదో సైలెంట్ కిల్లర్.. కాటు వేస్తే కాటికే..! ఈ లక్షణాలు
సెకన్లలోనే కరెంట్ బిల్లు.. సూపర్ స్మార్ట్‌గా మొబైల్‌లోనే..
సెకన్లలోనే కరెంట్ బిల్లు.. సూపర్ స్మార్ట్‌గా మొబైల్‌లోనే..
అన్నంలో వెంట్రుక బంధుత్వానికి సంకేతం కాదు..అనారోగ్యానికి హెచ్చరిక
అన్నంలో వెంట్రుక బంధుత్వానికి సంకేతం కాదు..అనారోగ్యానికి హెచ్చరిక
అల్లు అర్జున్ స్పెషల్ మ్యాష్ అప్ వీడియో అదిరిపోయింది..
అల్లు అర్జున్ స్పెషల్ మ్యాష్ అప్ వీడియో అదిరిపోయింది..
పేరుకే పెద్ద ప్లేయర్లు.. తొలివారంలోనే తేలిపోయిన తోపులు..
పేరుకే పెద్ద ప్లేయర్లు.. తొలివారంలోనే తేలిపోయిన తోపులు..
ఆమ్లెట్ వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
ఆమ్లెట్ వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
మురికి పట్టిన షూస్‌ను కొత్తవాటిలా మెరిపించే మ్యాజిక్ చిట్కాలు!
మురికి పట్టిన షూస్‌ను కొత్తవాటిలా మెరిపించే మ్యాజిక్ చిట్కాలు!
రికార్డు స్థాయిలో 21 కోట్ల డీమ్యాట్ ఖాతాలు!
రికార్డు స్థాయిలో 21 కోట్ల డీమ్యాట్ ఖాతాలు!
అత్యాచారం చేసి దాడి చేసిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు
అత్యాచారం చేసి దాడి చేసిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు