AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీడు మామూలోడు కాడు.. భయంతో బతికున్న బల్లిని అమాంతం మింగేశాడు!

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ యువకుడు పోలీసులను అరెస్ట్ చేస్తారనే భయంతో బతికున్న బల్లిని అమాంతంగా మింగేసింది. ఈ విచిత్ర ఘటన..

వీడు మామూలోడు కాడు.. భయంతో బతికున్న బల్లిని అమాంతం మింగేశాడు!
Man Swallows Live Lizard
Srilakshmi C
|

Updated on: Jul 11, 2023 | 8:00 AM

Share

లక్నో: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ యువకుడు పోలీసులను అరెస్ట్ చేస్తారనే భయంతో బతికున్న బల్లిని అమాంతంగా మింగేసింది. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కాన్పూర్‌లోని మల్లవాన్ ప్రాంతానికి చెందిన మహేష్‌ అత్యాచారం కేసులో పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ విధించింది. దీంతో వారు జైలుకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఎక్కడ అరెస్ట్‌ చేసి జైలుకు తరలిస్తారేమోననే భయంతో సాద్ పోలీస్ స్టేషన్‌లోనే మహేష్‌ బతికున్న బల్లిని మింగేశాడు. వెంటనే పోలీసులు మహేష్‌ను చికిత్స నిమిత్తం భిటార్‌గావ్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వైద్యులు చికిత్స చేసి మహేశ్‌ కడుపులోని బల్లిని బయటకు తీశారు. ప్రస్తుతం మహేష్ ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. బల్లిని ఎందుకు మింగావని పోలీసులు మహేష్‌ను ప్రశ్నించగా.. జైలుకు తీసుకెళ్తారేమోననే భయంతోనే అలా చేసినట్లు చెప్పాడని ఎస్‌ఏడీ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి విజయ్ శుక్లా తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.