AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేసేదీ కూలీ పని, ఉన్నది 40 గజాల ఇల్లు.. రూ. కోట్లు టాక్స్ కట్టాలంటూ ఐటీ నోటీసులు..!

ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలోని చేనేత నగరం పిల్ఖువాకు చెందిన మొహల్లా రాణా పట్టి మహాదేవ్‌లో నివసిస్తున్న సుభాష్‌కు రూ.7 కోట్ల నోటీసు అందింది. సుభాష్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆదాయపు పన్ను శాఖ అతనికి ఈ నోటీసు పంపింది. నోటీసు వచ్చినప్పటి నుండి ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది. ఫిర్యాదు తర్వాత, అధికారులు ఈ విషయంపై తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.

చేసేదీ కూలీ పని, ఉన్నది 40 గజాల ఇల్లు.. రూ. కోట్లు టాక్స్ కట్టాలంటూ ఐటీ నోటీసులు..!
IT Notice to Labour
Balaraju Goud
|

Updated on: Jun 14, 2025 | 9:39 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలోని చేనేత నగరం పిల్ఖువాకు చెందిన మొహల్లా రాణా పట్టి మహాదేవ్‌లో నివసిస్తున్న సుభాష్‌కు రూ.7 కోట్ల నోటీసు అందింది. సుభాష్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆదాయపు పన్ను శాఖ అతనికి ఈ నోటీసు పంపింది. నోటీసు వచ్చినప్పటి నుండి ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది. ఫిర్యాదు తర్వాత, అధికారులు ఈ విషయంపై తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంలో అధికారుల నుండి న్యాయమైన దర్యాప్తు జరగాలని కార్మికుడు డిమాండ్ చేశాడు.

హాపూర్‌లోని పిల్ఖువాలోని మొహల్లా రాణా పట్టి మహాదేవ్‌లో నివసించే సుభాష్ చాలా సంవత్సరాలుగా కూలీగా పనిచేస్తున్నాడు. అతను తన కుటుంబాన్ని కూలీపని చేసి, పోషించుకుంటున్నాడు. అయితే, ఫిబ్రవరి 2024లో ఆదాయపు పన్ను శాఖ నుండి సుభాష్ ఇంటికి నోటీసు వచ్చింది. కానీ సుభాష్ ఈ నోటీసును పట్టించుకోలేదు. ఇప్పుడు మరోసారి 10 నుండి 15 రోజుల క్రితం, అతనికి ఆదాయపు పన్ను శాఖ నుండి మరో నోటీసు పంపింది. ఇందులో రూ.7 కోట్ల లావాదేవీ జరిగిందని ప్రస్తావించింది.

ఈ నోటీసు తర్వాత, కార్మికుడు సుభాష్ నిద్రపట్టలేదు. అతని కాళ్ళ కింద నుండి నేల జారిపోయినంత పనైంది. ఈ విషయం గురించి సుభాష్ ఇప్పుడు సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సుభాష్ ఆ ప్రాంతంలో 40 గజాల ఇంట్లో నివసిస్తున్నాడు. సమాచారం ప్రకారం, 2020-21 సంవత్సరంలో, దోహ్రానాలోని ఒక ఆసుపత్రి నుండి GSTకి సంబంధించిన రెండు పెద్ద లావాదేవీల గురించి ఆదాయపు పన్ను శాఖకు సమాచారం అందింది.

ఈ లావాదేవీలో సుభాష్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. సమాచారం ప్రకారం, సుభాష్ పేరుతో GSTR-1, GSTR-3B లలో లావాదేవీలు జరిగాయి. దాదాపు రూ. 3,27,40,680 తోపాటు రూ. 3,75,74,0850 లావాదేవీలు నమోదు అయినట్లు చెబుతున్నారు. లావాదేవీ ఆధారంగా, హాపూర్‌లోని ఆదాయపు పన్ను శాఖ అధికారి ఫిబ్రవరి 9, 2024న నోటీసు జారీ చేసి, ఫిబ్రవరిలో సుభాష్‌కు సమాధానం అడిగారు. కానీ సుభాష్ ఈ మొత్తం ప్రక్రియ గురించి పెద్దగా అవగాహన లేదు. అందుకే అతను నోటీసుకు సమాధానం ఇవ్వలేదు. నోటీసును పట్టించుకోలేదు.

నోటీసుకు సమాధానం అందకపోవడంతో, శాఖ కఠినంగా వ్యవహరించడంతో, సుభాష్ అధికారులను సంప్రదించి న్యాయం కోసం వేడుకున్నాడు. ఈ మొత్తం విషయంలో న్యాయమైన దర్యాప్తు నిర్వహించాలని సుభాష్ అధికారులను వేడుకున్నాడు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత, అధికారులు కూడా సీరియస్‌గా తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ మొత్తం కేసులో, సుభాష్ పత్రాల దుర్వినియోగం జరిగిందనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇప్పుడు దర్యాప్తు తర్వాతే సుభాష్ కు రూ.7 కోట్ల లావాదేవీకి మధ్య సంబంధం ఏమిటో స్పష్టమవుతుంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us