AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమానవీయ ఘటన: రూ.3 వేల అప్పు కట్టలేదనీ.. నగ్నంగా మార్చి వీధుల్లో ఊరేగింపు

అప్పుగా తీసుకున్న రూ.3 వేలు తిరిగి చెల్లించలేదని ఓ చిరు వ్యాపారిని నగ్నంగా మార్చి, కర్రతో కొడుతూ వీధుల్లో ఊరేగించాడో వ్యక్తి. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సోమావారం (సెప్టెంబర్‌ 18) చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సంఘటన వెలుగు చూసింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడితోపాటు అతనికి సహకరించిన మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు..

అమానవీయ ఘటన: రూ.3 వేల అప్పు కట్టలేదనీ.. నగ్నంగా మార్చి వీధుల్లో ఊరేగింపు
Noida vegetable vendor thrashed in UP
Srilakshmi C
|

Updated on: Sep 21, 2023 | 7:01 AM

Share

నోయిడా, సెప్టెంబర్‌ 21: అప్పుగా తీసుకున్న రూ.3 వేలు తిరిగి చెల్లించలేదని ఓ చిరు వ్యాపారిని నగ్నంగా మార్చి, కర్రతో కొడుతూ వీధుల్లో ఊరేగించాడో వ్యక్తి. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సోమావారం (సెప్టెంబర్‌ 18) చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సంఘటన వెలుగు చూసింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడితోపాటు అతనికి సహకరించిన మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకెళ్తే..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని నొయిడా పరిధిలోని సెక్టార్‌ 88కి చెందిన అమిత్‌ అనే ఓ చిరు వ్యాపారి వెల్లుల్లి విక్రయంతో జీవనం సాగిస్తున్నాడు. నోయిడిలోని ఫేజ్‌2 మార్కెట్లో వ్యాపారం చేసుకునే వాడు. కొన్ని రోజుల క్రితం సుందర్‌ సింగ్‌ అనే కమీషన్‌ ఏజెంటు వద్ద వ్యాపారంలో పెట్టుబడి కోసం రూ.5,600 అప్పుగా తీసుకున్నాడు. అందులో బాధితుడు రూ.2,600 తిరిగి చెల్లించగలిగాడు. మిగిలిన నగదు చెల్లించలేకపోయాడు. వారం రోజులకుపైగా ఈ మొత్తాన్ని చెల్లించకపోవడంతో ఆగ్రహానికి గురైన కమీషన్‌ ఏజెంటు డబ్బు రికవరీ చేసుకోవడానికి సుందర్‌ సింగ్‌ మరికొందరు వ్యక్తులతో కలిసి అమిత్‌పై దాడి చేసేందుకు వెళ్లారు. అతను తన మద్ధతుదారులతో కలసి ఆ వ్యాపారిపై విరుచుకుపడ్డాడు. బాధితుడిని ఓ గదిలో బంధించి నగ్నంగా మార్చి చితకబాదారు. అనంతరం దుడ్డు కర్రతో కొడుతూ మార్కెట్లో ఊరేగించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అదికాస్తా వైరల్ కావడంతో విషయం వెలుగు చూసింది.

అంతేకాకుండా అదేరోజు రాత్రి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాడి, నేరపూరిత బెదిరింపు చర్యకు పాల్పడినందుకు, ఉద్ధేశ్యపూర్వకంగా అవమానించినందుకు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు అయిన లోన్‌ ఏజెంట్‌ సుందర్‌ సింగ్‌తోపాటు అతనికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వీడియోను చిత్రీకరించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసినవారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఓ పోలీసధికారి మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్