AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: తండ్రిని చంపి ముక్కలు ముక్కలుగా కోసిన కన్న కొడుకు.. ఆస్తి కోసం మరీ ఇంత దారుణమా?

ఆస్తి కోసం తన తండ్రినే కొడుకు హత్య చేసి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది

Crime News: తండ్రిని చంపి ముక్కలు ముక్కలుగా కోసిన కన్న కొడుకు.. ఆస్తి కోసం మరీ ఇంత దారుణమా?
Crime News
Aravind B
| Edited By: Janardhan Veluru|

Updated on: Mar 13, 2023 | 1:52 PM

Share

ఆస్తి కోసం తన తండ్రినే కొడుకు హత్య చేసి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. తివారిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరజ్ కుంద్ కాలనీలో ఉంటున్న మురళిధర్ గుప్తకు తన కొడుకు సంతోష్ కుమార్ గుప్త మధ్య గత కొన్నిరోజులుగా ఆస్తి వివాదం ఉంది. అయితే ఆస్తి కోసం తండ్రిని చంపడానికి కూడా వెనకాడలేదు కొడుకు.

ఆదివారం రాత్రి మురళిధర్ ఇంట్లో ఒంటరిగా ఉండగా.. అతనిపై తన కొడుకు సంతోష్ సుత్తెతో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో రక్తపు మడుగులో తండ్రి అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత కొడుకు సంతోష్ తండ్రి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి వాటిని ఓ సూట్ కేస్ లో కుక్కాడు. అనంతరం తమ ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలంలో దాచిపెట్టాడు.  విషయం తెలుసుకున్న సంతోష్ కుమర్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శరీర భాగాలను సేకరించిన పోలీసులు వాటిని పోస్టు మార్టానికి పంపించారు. సంతోష్ ను పోలీసులు అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం