AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boy in borewell: బోరు బావిలో పడిన రెండేళ్ల బాలుడు, మూడు గంటలు, 40 నిమిషాల రెస్క్యూ.. ఆఖరుకు ఏం జరిగింది!

మరోమారు అదే నిర్లక్ష్యం, ఎంతమంది చిన్నారులు బలైపోయినా జనాల్లో అదే నిద్రావస్థ.. నిర్లక్ష్యం కారణంగా బోరుబావిలో పడి చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు ఏదో ఒక చోట తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా మరో చిన్నారి బోరుబావిలో ..

Boy in borewell: బోరు బావిలో పడిన రెండేళ్ల బాలుడు, మూడు గంటలు, 40 నిమిషాల రెస్క్యూ.. ఆఖరుకు ఏం జరిగింది!
Borewell
Jyothi Gadda
|

Updated on: Jun 08, 2022 | 6:10 PM

Share

మరోమారు అదే నిర్లక్ష్యం, ఎంతమంది చిన్నారులు బలైపోయినా జనాల్లో అదే నిద్రావస్థ.. నిర్లక్ష్యం కారణంగా బోరుబావిలో పడి చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు ఏదో ఒక చోట తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా మరో చిన్నారి బోరుబావిలో పడిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. కానీ, అదృష్ట వశాత్తు..పసివాడికి ఈ భూమ్మీద నూకలున్నాయి కాబోలు,..వాడు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన అక్కడి అధికారులు, సిబ్బంది బాలుడిని కేవలం 40 నిమిషాల్లోన రెస్క్యూ చేసి కాపాడారు. ఈ ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది.

గుజరాత్‌ రాష్ట్రం సురేంద్రనగర్ జిల్లాలోని పొలంలో రెండేళ్ల బాలుడు లోతైన బోరుబావిలో పడిపోయాడు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో శివం అనే బాలుడు తన తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకునే దుదాపూర్ గ్రామంలోని పొలంలో ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న జిల్లా పరిపాలన అధికారులు స్థానిక డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్‌తో పాటు ఇక్కడికి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మదాబాద్‌లోని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళానికి చెందిన బృందాన్ని అప్రమత్తం చేశారు. బాలుడు బోరుబావిలో పడి 20-25 అడుగుల లోతులో చిక్కుకున్నాడని ధృంగాద్ర పరిపాలన అధికారి ఎంపీ పటేల్ తెలిపారు.

స్థానిక యంత్రాంగం.. ఆర్మీ, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, పోలీసుల సహాయాన్ని కూడా కోరింది. ఆర్మీ, పోలీసులు, జిల్లా పరిపాలన సిబ్బంది, గ్రామస్తులతో కూడిన బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. వారంతా సమన్వయంతో పనిచేసి రాత్రి 10.45 గంటలకు చిన్నారిని బోరుబావిలో నుంచి సురక్షితంగా బయటకు తీశారు. బాలుడిని ధృంగాద్ర పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అక్కడి నుంచి తదుపరి చికిత్స కోసం జిల్లా సివిల్ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిసింది. పోలీసులు, ఆర్మీ, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత 40 నిమిషాల్లోనే రెస్క్యూ ఆపరేషన్ పూర్తయినట్టు ధృంగాధ్ర పరిపాలన అధికారి ఎంపీ పటేల్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..