ఘోర ప్రమాదాలు.. ఓ వైపు రెండు కార్గో రైళ్లు ఢీ… మరోవైపు బస్సు బోల్తా..
మధ్యప్రదేశ్లో ఆదివారం రెండు ఘోర ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఓ వైపు రెండు కార్గో రైళ్లు ఢీ కొనగా.. మరోవైపు ఓ ట్రావెల్స్ బస్సు బోల్తాకొట్టింది.
మధ్యప్రదేశ్లో ఆదివారం రెండు ఘోర ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఓ వైపు రెండు కార్గో రైళ్లు ఢీ కొనగా.. మరోవైపు ఓ ట్రావెల్స్ బస్సు బోల్తాకొట్టింది. సింగ్రౌలీ ప్రాంతంలో.. బొగ్గును మోసుకెళ్తున్న రెండు కార్గో రైళ్లు ఢీకొన్నాయి. ఆదివారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో లోకోపైలట్తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఎన్టీపీసీ రెస్యూ టీం రంగంలోకి దిగింది. సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కూడా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు. క్ష తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే మరోవైపు షాహదోల్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సు రెవా దగ్గర మలుపు తిరుగుతుండగా.. అదుపుతప్పి లోకలో పడింది. ఈ ఘటనలో 11 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.