Train Accident: అకస్మాత్తుగా ప్లాట్‌ఫాంపైకి దూసుకెళ్లిన గూడ్స్ రైలు.. ముగ్గురు ప్రయాణికుల దుర్మరణం..

|

Nov 21, 2022 | 10:30 AM

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. జాజ్‌పూర్ కొరై స్టేషన్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పి.. ఏకంగా ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు.

Train Accident: అకస్మాత్తుగా ప్లాట్‌ఫాంపైకి దూసుకెళ్లిన గూడ్స్ రైలు.. ముగ్గురు ప్రయాణికుల దుర్మరణం..
Goods Train Rams
Follow us on

Odisha Train Accident: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. జాజ్‌పూర్ కొరై స్టేషన్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పి.. ఏకంగా ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనలో స్టేషన్ భవనం దెబ్బతిందని రైల్వే అధికారులు తెలిపారు. సహాయక బృందాలు, రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలను చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. రైలు ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చి.. వెయిటింగ్‌ రూంను ఢీకొట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో వెయిటింగ్‌ రూమ్‌లో ఉన్న ఇద్దరు ప్రయాణికులు మరణించారని.. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

గూడ్స్ రైలు.. ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లిన ఘటనలో 10 బోగీలు బోల్తాపడినట్లు అధికారులు తెలిపారు. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయని.. వారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. బోగీల కింద పలువురు చిక్కుకున్నట్టు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ మార్గంలో రైళ్ల ప్రయాణాన్ని సైతం నిలిపివేశారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..