AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Third Front: ‘కాంగ్రెస్ లేకుండా తృతీయ ఫ్రంట్ సాధ్యం కాదు’.. మరోసారి శరద్ పవార్ స్పష్టం

కాంగ్రెస్ లేకుండా తృతీయ ఫ్రంట్‌ను ఊహించుకోలేమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ మరోసారి స్పష్టం చేశారు.

Third Front: 'కాంగ్రెస్ లేకుండా తృతీయ ఫ్రంట్ సాధ్యం కాదు'.. మరోసారి శరద్ పవార్ స్పష్టం
NCP Chief Sharad Pawar (File Photo)
Balaraju Goud
|

Updated on: Apr 13, 2022 | 7:44 PM

Share

NCP Chief Sharad Pawar: కాంగ్రెస్ లేకుండా తృతీయ ఫ్రంట్‌ను ఊహించుకోలేమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ మరోసారి స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని పిలపునిచ్చారు. బుధవారం ముంబైలో ఎన్సీపీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎన్సీపీ మాజీ ఎంపీ మాజిద్ మెమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్సీపీ అధినేత దేశంలో థర్డ్‌ ఫ్రంట్‌పై ఆసక్తికర ప్రకటన చేశారు. కాంగ్రెస్ లేకుండా తృతీయ ఫ్రంట్‌ను ఊహించుకోవడానికి పవార్ నిరాకరించారు. కాంగ్రెస్ లేకుండా దేశంలో థర్డ్‌ఫ్రంట్‌ను ఊహించలేమని అన్నారు.

గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర రాజకీయాల్లో రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంటిపై దాడికి ప్రయత్నించారు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు 15 మందిని అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసులు చెబుతున్నారు. వీరిలో 109 మందిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ దాడికి సంబంధించి ఓ జర్నలిస్టును కూడా అరెస్టు చేశారు. మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (MSRTC) సమ్మె చేస్తున్న ఉద్యోగుల బృందం ముంబైలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్ నివాసం సిల్వర్ ఓక్‌పై దాడి చేసింది. తమ పని.. డిమాండ్లను నెరవేర్చడంలో ఆయన ఆటంకంగా మారారని MSRTC కార్మికులు ఆరోపించారు.

ఈ ఘటనలో వంద మందికి పైగా ఆందోళనకారులు బారికేడ్లు బద్దలు కొట్టి, బాటిళ్లు, బూట్లు విసిరి శరద్ పవార్ బంగ్లాలోకి ప్రవేశించేందుకు గేటు లోపలికి వచ్చారు. ఈ సందర్భంగా ఎన్‌సిపి అధినేత్రి కుమార్తె, లోక్‌సభ ఎంపి సుప్రియా సూలే ఆందోళనకారులను శాంతింపజేసేందుకు ప్రయత్నించి శాంతి భద్రతల కోసం విజ్ఞప్తి చేస్తూ వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు.

ఈ ఘటనను ఖండిస్తూ.. నేతలను, వారి కుటుంబాలను ఈ విధంగా టార్గెట్ చేయడం సరికాదని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రిని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని సీఎం హెచ్చరించారు.

Read Also…  APSRTC: డీజిల్ సెస్ పేరుతో ‘బాదుడే బాదుడు’.. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై భగ్గుమన్న విపక్షాలు