AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APSRTC: డీజిల్ సెస్ పేరుతో ‘బాదుడే బాదుడు’.. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై భగ్గుమన్న విపక్షాలు

సీఎం జగన్ 'బాదుడే బాదుడు' చర్యలతో ప్రజలు విలవిల్లాడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

APSRTC: డీజిల్ సెస్ పేరుతో 'బాదుడే బాదుడు'.. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై భగ్గుమన్న విపక్షాలు
Apsrtc Bus Fares
Ram Naramaneni
|

Updated on: Apr 13, 2022 | 7:41 PM

Share

Andhra Pradesh: డీజిల్ సెస్‌ పేరుతో APSRTC ప్రయాణికుల ఛార్జీలను పెంచింది. పల్లెవెలుగు బస్సుల్లో రూ.2, ఎక్స్​ప్రెస్​ బస్సుల్లో రూ. 5, ఏసీ బస్సుల్లో రూ.10 చొప్పున డీజిల్ సెస్ వసూలు చేయనుంది. గురువారం నుంచే పెంచిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. అయితే ప్రయాణీకులపై ఆర్టీసీ సెస్ వాయింపుపై టీడీపీ(Tdp) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం జగన్(Cm Jagan) తన అసమర్థ పాలనతో పేదలపై పన్నులు వేస్తూ, ఛార్జీలు పెంచుతూ ప్రజలను పీక్కుతుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు(Nara Chandrababu Naidu) ఆరోపించారు. ఇప్పటికే కరెంట్ ఛార్జీలు, చెత్త పన్నులు, ప్రాపర్టీ టాక్స్​లతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు అల్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో పేదలు, మద్య తరగతి ప్రజలు ఎక్కువగా వినియోగించే ప్రజా రవాణా ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెంచటం కరెక్ట్ కదాన్నారు. ప్రభుత్వం తన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంతో రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తుందో అర్థం కావట్లేదన్నారు.  ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తరువాత సంస్థకు అండగా నిలవాల్సింది ప్రభుత్వమేనన్న చంద్రబాబు.. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వామపక్షాలు ఫైర్….

మరోవైపు ఆర్టీసీ ప్రయాణీకులపై డీజిల్ సెస్ భారంపై వామపక్షాలు తీవ్ర స్థాయిలో ఫైరవుతున్నాయి. పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను వెంటనే ఉపసంహరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.  ఇప్పటికే అధిక ధరలు, పెంచిన పన్నుల భారంతో జనజీవనం అస్తవ్యస్తమైందని పేర్కొన్నారు. డీజిల్ సెస్ పేరుతో ఆర్టీసీ ఛార్జీలను పెంచి మరో రూ.720 కోట్లు ప్రజలపై భారం మోపడం తగదన్నారు. పన్నుల భారాలు, చార్జీల మోతలే ఎజెండాగా రాష్ట్ర ప్రభుత్వ పాలన సాగటం విచారకరమని తెలిపారు.

ఇదేం పద్దతి: బీజేపీ

డీజిల్ సెస్ పేరుతో ఆర్టీసీ ఛార్జీల పెంపుపై  ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఫైరయ్యారు. పెంచిన ఆర్టీసీ చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పల్లె వెలుగు బస్సుల్లో టికెట్ల ధరలు పెంచడం దారుణమన్నారు.  సామాన్యులు ప్రయాణం చేసే పల్లె వెలుగు బస్సుకి 10 రూపాయలు కనీస ధర చేయడం దారుణమన్నారు.  20 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాం అని చెప్తూ రేట్లు పెంచడమేంటని ప్రశ్నించారు. నష్టాల్లో ఉంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి కానీ రేట్లు పెంచడం ఏంటని ప్రశ్నించారు. ఆర్టీసీ ప్రయాణాన్ని సామాన్యులకు దూరం చేస్తుందని సోము వీర్రాజు ఆరోపించారు.

సెస్ విధించకపోతే సంస్థ మనుగడకే ప్రమాదం: ఆర్టీసీ ఎండీ

APSRTC చివరిసారిగా 2019 డిసెంబర్‌లో చార్జీలను సవరించింది. ఇప్పుడు డీజిల్‌ సెస్‌ పేరుతో వడ్డనకు దిగింది. అప్పుడు డీజిల్‌ లీటర్‌ 67 రూపాయలు ఉంటే ప్రస్తుతం 107 రూపాయలకు పెరుగడాన్ని ఆర్టీసీ అధికారులు గుర్తుచేస్తున్నారు. డీజిల్‌ నష్టాలు భరించలేని విధంగా ఉండటంతో పాటు కరోనా కూడా ఆర్టీసీని దెబ్బతీసిందని సంస్థ అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీ లాభాలు రాకపోయినా నష్టాలు లేకుండా ఉండాలంటే చార్జీలు 32 శాతం పెంచాల్సి ఉందన్నారు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు. డీజిల్‌ సెస్‌ వడ్డనతో ప్రజలపై ఏడాదికి 720 కోట్ల రూపాయల భారం పడనుంది. ప్రజలు ఎక్కువగా ప్రయాణించేది పల్లె వెలుగులోనే. వాటి కనీస చార్జీని పది రూపాయలకు పెంచడం పేదలకు భారం కానుంది.

Also Read: APSRTC: ఏపీ ప్రజలపై మరో భారం.. ఆర్టీసీ ఛార్జీలపై డీజిల్ సెస్ విధింపు