Viral: పక్కింటి నుంచి విపరీతమైన దుర్వాసన.. విచిత్ర మంత్రాలు… ఏమైందో అని చుట్టుపక్కల వారు వెళ్లి చూడగా షాక్
యూపీలో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. మూఢనమ్మకాలతో ఓ కుటుంబం ఊహించని పని చేసింది. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది.
uttar pradesh: ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగరాజ్(prayagraj)లో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. చనిపోయిన యువతి డెడ్బాడీని మూడు రోజులుగా ఇంట్లోనే పెట్టుకుని కూర్చున్నారు ఆమె కుటుంబ సభ్యులు. మృతురాలిని తిరిగి బతికించేందకు వారు విచిత్ర పూజలు చేశారు. చుట్టుపక్కలవారికి ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడం.. వారెవరూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూడగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని కర్ఛన ప్రాంతంలోని డీహా గ్రామంలో 18 ఏళ్ల దీపిక 3 రోజుల క్రితం చనిపోయింది. అయితే మృతురాలి కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఆమెను బతికించేందుకు క్షుద్రపూజలు చేశారు. అయితే 3 రోజులుగా అలాగే ఉండటం వల్ల.. డెడ్బాడీ కుళ్లిపోయి దుర్వాసన వచ్చింది. అది గమనించిన చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వచ్చిన పోలీసులు.. ఇంటి లోపల దృశ్యాలను చూసి కంగుతిన్నారు.
చనిపోయిన యువతిని బతికించడానికి ఆమె కుటుంబమంతా క్షుద్రపూజలు చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. ఇంట్లోని మరో 11 మంది సభ్యులు కూడా అనారోగ్యానికి గురయ్యారు. రెండ్రోజులుగా ఇంట్లో ఆహారం వండలేదని, కుటుంబ సభ్యులు గంగాజలం మాత్రమే తాగారని తెలుసుకున్న అధికారులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కుటుంబ సభ్యుల్లో చాలామంది చదువుకున్నవారు ఉన్నారని.. కానీ మూఢనమ్మకాలతో వారంతా ఇలా చేశారని చెప్పుకొచ్చారు. యువతి మృతదేహాన్ని ఇంటి నుంచి బయటకు తెచ్చి పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. కుటుంబసభ్యుల మానసిక పరిస్థితి బాగాలేదని, వారిని ముందుగా విచారించి.. కౌన్సిలింగ్ ఇచ్చి.. ఆ తర్వాత తదుపరి చర్యలు గురించి ఆలోచిస్తామని పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..