AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Teachers Day 2025: టీచర్స్‌కి స్పూర్తి ఈ లెక్కల మాస్టర్.. 20 ఏళ్లుగా స్కూల్‌కి వెళ్లేందుకు నదిలో ఈత.. ఒక్క సెలవు లేదు

చదువు చెప్పడం ఒక వృత్తికాదు.. కొన్నివేల మంది భవిష్యత్ ని తీర్చిదిద్దే ఒక గురుతర భాద్యత. అందుకనే మన సమాజంలో గురువుకి విశిష్ట స్థానం ఉంది. తాను చేసే పనిలో దైవాన్ని చూసే గొప్ప వ్యక్తులు తరచుగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి ఒక టీచర్ గురించి నేడు తెలుసుకుందాం.. గత 20 ఏళ్లగా చదువు చెప్పడానికి నదిని ఈదుతూ వెళ్తున్నాడు. అంతేకాదు 1994 నుంచి ఒక్క సెలవు కూడా తీసుకోలేదు.. విద్య పట్ల అతని అంకితభావం దేశంలో అందరికీ ప్రేరణగా నిలిచింది.అంతటి గొప్ప ఉపాధ్యాయుడి గురించి ఈ రోజు తెలుసుకుందాం..

Teachers Day 2025: టీచర్స్‌కి స్పూర్తి ఈ లెక్కల మాస్టర్.. 20 ఏళ్లుగా స్కూల్‌కి వెళ్లేందుకు నదిలో ఈత.. ఒక్క సెలవు లేదు
Math Teacher Abdul Malik
Surya Kala
|

Updated on: Sep 04, 2025 | 10:25 AM

Share

కేరళలో ఒక ఉపాధ్యాయుడు తాను ఉద్యోగం చేస్తున్న పాఠశాలకు చేరుకోవడానికి ప్రతిరోజూ కడలుండి నదిని ఈదుతున్నాడు. అతను రెండు దశాబ్దాలకు(20 ఏళ్ల) పైగా ఇలాగే చేస్తున్నాడు. నదిని ఈదుతూ పాఠశాలకు చేరుకునే ఉపాధ్యాయుడి పేరు అబ్దుల్ మాలిక్. మలప్పురం జిల్లాలోని పడింజట్టుమురి గ్రామానికి చెందిన గణిత ఉపాధ్యాయుడు. అతను నదిని ఈదుతూ మలప్పురంలోని ముస్లిం లోయర్ ప్రైమరీ స్కూల్‌కు చేరుకుంటాడు.

ఇలా నదిని ఈదుతూ వెళ్ళడం ద్వారా స్కూల్ కు చేరుకుంటే.. అబ్దుల్ మాలిక్ రోడ్డు మార్గంలో 12 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన అవసరం ఉండదు. విద్య పట్ల ఆయనకున్న అంకితభావం దేశవ్యాప్తంగా స్ఫూర్తినిచింది. ఆయన తన పుస్తకాలు, దుస్తులను ప్లాస్టిక్ సంచిలో పెట్టుకుని ప్రతిరోజూ నదిని దాటి పాఠశాలకు చేరుకుంటారు. మాలిక్ పర్యావరణ పరిరక్షణకు కూడా కట్టుబడి ఉన్నాడు. ఎందుకంటే ఆయన నదుల శుభ్రపరిచే కార్యక్రమానికి కూడా నాయకత్వం వహిస్తాడు.

1994 నుంచి ఒక్క సెలవు కూడా తీసుకోలేదు. మాలిక్ తన విద్యార్థులకు ప్రకృతిని గౌరవించడం కూడా నేర్పుతాడు. 1994 నుంచి అబ్దుల్ మాలిక్ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. తాను ఉద్యోగం చేసే స్కూల్ కి వెళ్ళాలంటే.. వివిధ బస్సులలో మూడు గంటల పాటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీంతో సులభంగా స్కూల్ కు చేరుకోవడానికి నదిని ఈత కొట్టడానికి ఎంచుకున్నాడు. ప్రతి రోజూ ఉదయం అతను తన పుస్తకాలు, భోజనం, దుస్తులను ఒక ప్లాస్టిక్ సంచిలో ప్యాక్ చేసి,.. టైర్ ట్యూబ్‌కు కట్టి, ఆపై నదిని దాటడానికి ఈదతాడు.

ఇవి కూడా చదవండి

ఇది మాత్రమే కాదు వర్షాకాలంలో కూడా అతను ఈత కొట్టడం ద్వారా నదిని దాటుతాడు. తరువాత అతను పాఠశాలకు చేరుకుంటాడు. మాలిక్ ఈ విషయంపై మాట్లాడుతూ.. బస్సులో పాఠశాలకు చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. బస్సుల సమయానికి కూడా రావు. అటువంటి పరిస్థితిలో రవాణాపై ఆధారపడటం కంటే ఈత కొట్టడం మంచిది. ప్రతిరోజూ ఈత కొట్టడం ద్వారా నదిని దాటడానికి అతనికి దాదాపు 15-30 నిమిషాలు పడుతుంది. అతను 20 సంవత్సరాలకు పైగా ఒక్క రోజు కూడా స్కూల్ కు లీవ్ పెట్టలేదు.

విద్యార్థులు ఆయనను ముద్దుగా “ట్యూబ్ మాస్టర్” అని పిలుస్తారు. విద్యార్థులు ఆయనను ప్రేమగా “ట్యూబ్ మాస్టర్” అని పిలుస్తారు. మాలిక్ నిబద్ధత చదువుతో మాత్రమే కాదు ప్రకృతి పట్ల కూడా ఉంటుంది. మాలిక్ తన విద్యార్థులతో కలిసి కదలుండి నదిని క్రమం తప్పకుండా శుభ్రపరిచే కార్యక్రమాలు నిర్వహిస్తాడు. విద్యార్థులతో పాటు అతను నది నుండి ప్లాస్టిక్ వ్యర్థాలు, శిధిలాలను సేకరిస్తాడు. ఇది ప్రకృతి పట్ల అతని ప్రేమ, బాధ్యతను కూడా చూపిస్తుంది. మాలిక్ 5వ తరగతి చదివే స్టూడెంట్స్ కు.. 10 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న విద్యార్థులకు ఈత నేర్పిస్తాడు.

స్థానిక విద్యాశాఖ అధికారులు మాలిక్ ప్రయత్నాలను ప్రశంసించారు. విద్యాశాఖ అధికారి ఎస్. రాజీవ్ మాట్లాడుతూ, “మాలిక్ సర్ బోధన పట్ల అంకితభావానికి మాత్రమే కాకుండా.. పర్యావరణం పట్ల ఆయన క్రియాశీలతకు కూడా ఆదర్శప్రాయుడు. ఆయన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇద్దరికీ స్ఫూర్తినిస్తారు.” సోషల్ మీడియా, ఇతర వార్తా సంస్థలు ప్రచురించిన అబ్దుల్ మాలిక్ కథపై ప్రజలలో ఆసక్తిని రేకెత్తించింది.\

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..