AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్వప్న సురేష్ కోసం ‘లుక్ ఔట్ నోటీసు’ జారీ.. ?

కేరళలో గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితురాలైన  స్వప్న సురేష్ కోసం లుక్ ఔట్ నోటీసు జారీ చేసే యోచనలో ఉన్నామని కస్టమ్స్ శాఖ ప్రకటించింది. ఆమె పరారీలో ఉన్న సంగతి విదితమే. ఈ రాష్ట్రంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్ కి చెందిన..

స్వప్న సురేష్ కోసం 'లుక్ ఔట్ నోటీసు' జారీ.. ?
Umakanth Rao
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Jul 08, 2020 | 2:27 PM

Share

కేరళలో గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితురాలైన  స్వప్న సురేష్ కోసం లుక్ ఔట్ నోటీసు జారీ చేసే యోచనలో ఉన్నామని కస్టమ్స్ శాఖ ప్రకటించింది. ఆమె పరారీలో ఉన్న సంగతి విదితమే. ఈ రాష్ట్రంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్ కి చెందిన ఓ మాజీ ఉద్యోగిని అరెస్టు చేశామని, అతని నుంచి వివరాలు సేకరిస్తున్నామని కస్టమ్స్ అధికారులు తెలిపారు. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ. 15 కోట్ల విలువైన 30 కేజీల బంగారం స్వాధీనం వార్త సంచలనం రేపింది. ఈ కేసును  కస్టమ్స్ తో బాటు సీబీఐ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ఐఎ) దర్యాప్తు చేయవచ్చునని, అలాగే జాతీయ భద్రతతో కూడిన అంశమైనందున ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (‘రా’) కూడా ఇందులోభాగమయ్యే సూచనలు ఉన్నాయని తెలుస్తోంది.

నాలుగు రోజులక్రితం ఏం జరిగింది ?

నాలుగు రోజుల క్రితం తిరువనంతపురంలోని యుఏఈ కాన్సులేట్ కార్యాలయానికి పి. సరిత్ అనే ఉద్యోగి పేరిట ఓ పార్సెల్ అందింది. అందులో ఈ బంగారం ఉంది. ఈ వైనం కస్టమ్స్ కి తెలిసి అతడిని అదుపులోకి తీసుకుని విచారించడం ప్రారంభించింది. (కాగా ఒక్క ‘మాల్’ పూర్తయితే స్వప్న సురేష్ కి లక్షల్లో కమీషన్ అందేదని తెలుస్తోంది). స్వప్నకి పలువురు ఉన్నత స్థాయి రాజకీయ నేతలతో లింక్ ఉన్నట్టు భావిస్తున్నారు. కేరళలో ఆమె పాలక ఎల్ డీ ఎఫ్ నాయకులకు పలు ఫోన్ కాల్స్ చేసినట్టు అనుమానిస్తున్నారు. గల్ఫ్ నుంచి గోల్డ్ స్మగ్లింగ్ కోసం ఆమె తన ‘దౌత్యహోదా’ ను అడ్డుపెట్టుకుని కాన్సులేట్ డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసిందట. స్పేస్ పార్క్ ప్రాజెక్టులో ఆమె జాబ్ లో చేరినప్పుడు నెలకు జీతం లక్ష రూపాయలని, కానీ అంతకుముందు ఎయిరిండియాకు చెందిన ‘శాట్స్’ లో ఆమె వేతనం  25 వేలు మాత్రమేనని వెల్లడైంది. స్వప్న విద్యార్హతల్లో కూడా ఎన్నో అవకతవకలు బయటపడ్డాయి. తను జలంధర్ లో బీ.ఆర్. అంబేద్కర్ నిట్ నుంచి బీ. కామ్ పూర్తి చేశానని చెప్పుకున్నప్పటికీ.. ఆ సంస్థ బీ. కామ్ కోర్సులేవీ నిర్వహించలేదని తెలిసింది.  అటు- సరిత్ కి, స్వప్న కి మధ్య ఉన్న సంబంధాలపై కూడా ఆరా తీస్తున్నారు.

రాష్ట్రంలో శివశంకర్ వంటి ఉన్నత స్థాయి ఉద్యోగి తొలగింపు, గోల్డ్ స్మగ్లింగ్ కేసు, స్వప్న సురేష్ వ్యవహారం ముఖ్యమంత్రి విజయన్ ప్రభుత్వానికి తలనొప్పి తెస్తుండగా  .. ఇదే అదనని, ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పూనుకొంది.