NEET PG 2021: యువ వైద్యులను ఫుట్‌బాల్‌గా భావించకండి.. కేంద్రంపై సుప్రీం కోర్టు ఆగ్రహం!

చివరి నిమిషంలో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ PG (NEET PG) సూపర్ స్పెషాలిటీ సిలబస్‌ని మార్చినందుకు సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని మందలించింది.

NEET PG 2021: యువ వైద్యులను ఫుట్‌బాల్‌గా భావించకండి.. కేంద్రంపై సుప్రీం కోర్టు ఆగ్రహం!
Neet Pg 2021 Exams
Follow us

|

Updated on: Sep 27, 2021 | 8:24 PM

NEET PG 2021: చివరి నిమిషంలో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ PG (NEET PG) సూపర్ స్పెషాలిటీ సిలబస్‌ని మార్చినందుకు సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని మందలించింది. పవర్ గేమ్‌లో యువ వైద్యులను ఫుట్‌బాల్‌గా చేయవద్దని కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వానికి సంబంధించిన అధికారుల సమావేశం ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. అక్టోబర్ 4 న సమాధానం దాఖలు చేయాలని కూడా కోరింది.

కేంద్రాన్ని చీవాట్లు పెడుతూ.. జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ బివి నాగరత్నలతో కూడిన ధర్మాసనం”పవర్ గేమ్‌లో ఈ యువ వైద్యులను ఫుట్‌బాల్‌గా భావించవద్దు.” అని తీవ్రంగా మాట్లాడింది.  సున్నితత్వం లేని బ్యూరోక్రాట్ల దయతో మేము ఈ వైద్యులను వదిలివేయలేము. ప్రభుత్వం తన ఇంటిని చక్కదిద్దాలి. ఎవరికైనా శక్తి ఉన్నందున, మీరు దానిని మీ ఇష్టానికి ఉపయోగించలేరు. ఇది విద్యార్థుల కెరీర్‌కు సంబంధించిన ప్రశ్న. ఇప్పుడు మీరు చివరి నిమిషంలో మార్పులు చేయలేరు. అంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. 

వచ్చే ఏడాది నుండి ఎందుకు మార్పులు చేయకూడదు?

జస్టిస్ డివై చంద్రచూడ్ మాట్లాడుతూ ప్రభుత్వం యువ వైద్యులతో సున్నితత్వంతో వ్యవహరించాలని అన్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) ఏమి చేస్తోంది? మీరు నోటీసు జారీ చేసి, ఆపై నమూనాను మార్చుతారా? విద్యార్థులు నెలలు ముందుగానే సూపర్ స్పెషాలిటీ కోర్సులకు సిద్ధమవుతారు. పరీక్షకు ముందు చివరి నిమిషాలలో నమూనా మార్చాల్సిన అవసరం ఎందుకు  వచ్చింది? ఇదే పనిని  వచ్చే సంవత్సరం చేయవచ చ్చు కదా? వచ్చే ఏడాది మార్పులతో ఎందుకు ముందుకు సాగలేరు? ‘

నమూనాను మార్చడం గురించి వివాదం ఏమిటి?

  • ప్రభుత్వం NEET PG సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్ 2021 సిలబస్‌ని పరీక్షకు 2 నెలల ముందు మార్చారని విద్యార్థులు పేర్కొన్నారు. దీనికి వ్యతిరేకంగా, 41 మంది పీజీ అర్హత కలిగిన వైద్యులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
  • 2018 లో నమూనా జనరల్ మెడిసిన్ నుండి 40%, సూపర్ స్పెషాలిటీ నుండి 60% అని విద్యార్థులు పేర్కొన్నారు, అయితే ఈసారి చివరి నిమిషంలో దానిని మార్చారు.  ఇందులో జనరల్ మెడిసిన్ నుంచి మొత్తం 100% ప్రశ్నలు అడిగారు.

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) PG సూపర్ స్పెషాలిటీ ఎగ్జామినేషన్ -2021, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) సిలబస్‌లో చివరి నిమిషంలో మార్పులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సెప్టెంబర్ 20 న సుప్రీం కోర్టు నోటీసు జారీ చేసింది. జాతీయ వైద్య కమిషన్ (NMC), కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయంపై నోటీసులు జారీ చేశారు.

Also Read: Building Collapsed: హమ్మయ్య.. అంతా సేఫ్.. ఇలా బయటకు వచ్చారో లేదో కూలింది..

SRH vs RR IPL 2021 Records: పోటీలో ఇరు జట్లు సమమే.. నేడు హోరాహోరీ పోరు గ్యారెంటీ.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?