Morbi Tragedy: మోర్భీ బ్రిడ్జీ ఘటనపై స్వతంత్య్ర దర్యాప్తు..? సుప్రీం కోర్టు ఏమందంటే..?

గుజరాత్‌లో వంతెన కూలిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఒక నియంత్రణ యంత్రాంగాన్ని సిద్ధం..

Morbi Tragedy: మోర్భీ బ్రిడ్జీ ఘటనపై స్వతంత్య్ర దర్యాప్తు..? సుప్రీం కోర్టు ఏమందంటే..?
Gujarat Morbi Bridge
Follow us

|

Updated on: Nov 22, 2022 | 7:55 AM

గుజరాత్‌లోని మోర్బీ బ్రిడ్జి ప్రమాదంపై కఠినంగా వ్యవహరించాలని గుజరాత్ హైకోర్టును సుప్రీంకోర్టు  ఆదేశించింది. గుజరాత్‌లోని మోర్బీలో జరిగిన దుర్ఘటనను ‘పెద్ద విషాదం’గా పేర్కొన్న దేశ అత్యున్నత న్యాయస్థానం.. దర్యాప్తులో నేరపూరిత నిర్లక్ష్యానికి దోషుల జవాబుదారీతనాన్ని పరిష్కరించేందుకు ఈ విషయాన్ని పర్యవేక్షించాలని హైకోర్టును కోరింది. బాధిత కుటుంబానికి తగిన పరిహారం అందేలా చూడాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.  గుజరాత్‌లో వంతెన కూలిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఒక నియంత్రణ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని సుప్రీంకోర్టు హైకోర్టుకు సూచించింది.

కాగా మోర్బీ ఘనటపై సుప్రీం కోర్టులో రెండు వేర్వేరు రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి.  భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వీటిపై స్పందిస్తూ.. హైకోర్టు స్వయంచాలకంగా వ్యవహరించి మూడు ఉత్తర్వులు జారీ చేయకపోతే స్పష్టమైన వాస్తవాలుదృష్టిలో ఉంచుకుని ఉన్నత న్యాయస్థానం ఈ అంశాన్ని పరిశీలిస్తుందని పేర్కొంది.

ప్రమాదంలో 141 మంది మృతి..

గుజరాత్‌లోని మోర్బీలో మచ్చు నదిపై నిర్మించిన సస్పెన్షన్ బ్రిడ్జిని ధ్రువీకరణ పత్రం లేకుండానే మరమ్మతులు చేసి , దానిపై రాకపోకలకు అనుమతించారు. వంతెన సామర్థ్యానికి మించి అధిక బరువు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని  అధికారులు తెలిపారు. మీడియా నివేదికల ప్రకారం, ఈ ప్రమాదం జరిగిన రోజు సాయంత్రం వంతెనపై సుమారు 500 మంది ఉన్నారు. అకస్మాత్తుగా వంతెన కూలిపోవడంతో దానిపై ఉన్న వ్యక్తులు నదిలో ఒకరిపై ఒకరు పడిపోయారు. ఈ ప్రమాదంలో దాదాపు 130 మందికి పైగా మరణించారు. అయితే.. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లలో మృతుల సంఖ్య 141గా పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం..

మోర్బీ ఘటన ఓ పెను విషాదమని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో విచారణ ఎక్కడ వరకు వచ్చింది..? బ్రిడ్జీ మరమ్మత్తులకు టెండర్ ఎలా ఇచ్చారు..? దానికి ఎవరు బాధ్యులు..? కంపెనీకి టెండర్ ఎంతకు ఇచ్చారు..? బాధిత కుటుంబానికి ఎలాంటి పరిహారం అందుతుంది..? స్వతంత్ర దర్యాప్తు అవసరం వంటి వివిధ అంశాలు విషయంలో విచారణ అవసరం అని సుప్రీం కోర్టు ధర్మాసనం తెలిపింది. ఈ అంశాలపై గుజరాత్ హైకోర్టు ఇప్పటికే చర్యలు తీసుకుంటోందని, లేకుంటే తామే ఈ అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. రాష్ట్ర పోలీసులతో పాటు స్వతంత్ర దర్యాప్తు అవసరమా.. కాదా.. అని చూడడానికి, మోర్భీ ఘటనపై సరిగ్గా దర్యాప్తు చేయడానికి న్యాయ ఫోరమ్ అవసరమని కోర్టు అంగీకరించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏంటీ ఆ బ్యూటీ.. ఈవిడా ఒకటేనా.!! ఈ అమ్మడు ఎంతలా మారిపోయిందో
ఏంటీ ఆ బ్యూటీ.. ఈవిడా ఒకటేనా.!! ఈ అమ్మడు ఎంతలా మారిపోయిందో
మామిడి ఆకుల్ని ఇలా తీసుకున్నారంటే.. అద్భుతంగా పని చేస్తాయి..
మామిడి ఆకుల్ని ఇలా తీసుకున్నారంటే.. అద్భుతంగా పని చేస్తాయి..
స్పైడర్‌ మ్యాన్‌ డ్రెస్సుల్లో రోడ్డెక్కిన యువ జంట షికారు..!
స్పైడర్‌ మ్యాన్‌ డ్రెస్సుల్లో రోడ్డెక్కిన యువ జంట షికారు..!
ఫుడ్ ఆర్డర్‌ను ఆవురావురుమంటూ తెరిచింది.. కట్ చేస్తే.. షాక్.!
ఫుడ్ ఆర్డర్‌ను ఆవురావురుమంటూ తెరిచింది.. కట్ చేస్తే.. షాక్.!
మొదలైన పుష్ప నామస్మరణ.. పుష్ప ఆర్టిస్ట్ లా లీక్స్ వైరల్.!
మొదలైన పుష్ప నామస్మరణ.. పుష్ప ఆర్టిస్ట్ లా లీక్స్ వైరల్.!
కుజ, గురు గ్రహాల మధ్య పరివర్తన..ఆ రాశుల వారికి కొన్ని కష్టనష్టాలు
కుజ, గురు గ్రహాల మధ్య పరివర్తన..ఆ రాశుల వారికి కొన్ని కష్టనష్టాలు
కలబంద రసంలో ఆరోగ్య రహస్యం దాగుంది.. ఎందుకో తెలుసా?
కలబంద రసంలో ఆరోగ్య రహస్యం దాగుంది.. ఎందుకో తెలుసా?
మీటింగ్ అవాంతరాల నుంచి ఈజీగా ‘స్విచ్’ అయిపోండి.. సూపర్ ఫీచర్..
మీటింగ్ అవాంతరాల నుంచి ఈజీగా ‘స్విచ్’ అయిపోండి.. సూపర్ ఫీచర్..
వ్యాయామం, డైట్ ఫాలో అవ్వకుండా ఇలా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోండి..
వ్యాయామం, డైట్ ఫాలో అవ్వకుండా ఇలా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోండి..
భద్రత విషయంలో ఆ కార్లు ఫెయిల్..!
భద్రత విషయంలో ఆ కార్లు ఫెయిల్..!