Gujarat Polls 2022: గుజరాత్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రచారం.. మధ్యలో ఆగిపోయిన జోడో యాత్ర..
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ నెల మొదటి వారంలో రెండు విడతలుగా జరగనున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సోమవారం ఆ రాష్ట్రంలోని రెండు బహిరంగ సభల్లో..

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ నెల మొదటి వారంలో రెండు విడతలుగా జరగనున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సోమవారం ఆ రాష్ట్రంలోని రెండు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. గుజరాత్ కాంగ్రెస్ నాయకుల తరఫున ఆయన ప్రచారం చేసేందుకు వీలుగా, ప్రస్తుతం మహారాష్ట్రలో సాగుతున్న భారత్ జోడో యాత్రకు కొంత విరామం ఇచ్చారు. సోమవారం రాజ్కోట్లో జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘‘ప్రమాదం జరిగిన ప్రదేశంలోని వాచ్మెన్లను అరెస్టు చేసి జైలుకు పంపినప్పటికీ, నిజమైన నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. భాజపాతో సత్సంబంధాలు ఉన్నందున ఈ దుర్ఘటనకు మూల కారకులైన వారికి ఏమీ చేయడంలేదా? రైతులు తమ రుణాల సమస్యను కూడా పాలకుల దృష్టికి తీసుకువెళ్లారు. కానీ వారు ఏం పాపం చేశారని పట్టించుకోలేదు. దేశంలోని ముగ్గురు, నాలుగురు ధనవంతుల కోట్ల రూపాయల రుణాలను మాత్రం బీజేపీ ప్రభుత్వం మాఫీ చేసింది’’ అని ఆయన ఎద్దేవా చేశారు.
రైతులు రుణాలు తిరిగి ఇవ్వకపోతే డిఫాల్టర్లని, కోటీశ్వరులు అలా చేస్తే నిరర్థక ఆస్తులు అంటారని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. రైతులు ప్రధానమంత్రి బీమా యోజనలో పెట్టుబడి పెడుతున్నారని, అయితే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వం నుంచి సహాయం కోరే సమయం వచ్చినప్పుడు వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని ఆయన బీజేపీని విమర్శించారు. ఇంకా ‘‘ఈ ముగ్గురు లేదా నలుగురు బిలియనీర్లు మీకు తెలుసా..? వారు డిపార్ట్మెంటల్ స్టోర్ లేదా ఎయిర్పోర్ట్లో.. ఏదైనా రంగంలోకి, ఏ పరిశ్రమలోనైనా ప్రవేశించవచ్చు, కానీ ఒక సాధారణ పౌరుడు వారి కలలను సాకారం చేసుకోవాలనుకుంటే ద్రవ్యోల్బణం, అవినీతి, నిరుద్యోగానికి గురవుతాడు. నైపుణ్యం కలిగిన యువకులు మంచి డిగ్రీలతో ఉత్తీర్ణత సాధించినప్పటికీ చిన్న ఉద్యోగాలను ఆశ్రయిస్తున్నారు’’ అని ఆయన అన్నారు.




आज सवाल उठता है, मोरबी हादसे में ज़िम्मेदार लोगों के खिलाफ़ क्यों कोई कार्रवाई नहीं की गई, बीजेपी के साथ उनका अच्छा रिश्ता है तो उनका कुछ नहीं होगा क्या? : श्री @RahulGandhi#CongressAaveChe pic.twitter.com/kFotMv9IP5
— Congress (@INCIndia) November 21, 2022
అనంతరం సూరత్లో జరిగిన మరో సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ గిరిజనుల సమస్యలపూ తన దృష్టిని సారించారు. ‘‘గిరిజనులను బీజేపీ ‘అటవీవాసులు’ అని పిలిచి వారిని అణగదొక్కాలని చూస్తుంది. మేము దేశంలోని నాయకులం కాబట్టి గిరిజనులకు అన్ని హక్కులను కల్పించాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోంది. ఎన్ఆర్ఈజీఏపై రెండు పార్టీల పనిని కూడా పోల్చి చూడండి ఓ సారి. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల కోసం పథకాన్ని తీసుకువచ్చి అందరికీ ఉపాధి కల్పించింది. అయితే బీజేపీ వచ్చి గిరిజనుల భూమిని లాక్కుంది. ఎన్ఆర్ఈజీఏ స్కామ్ చేసింద’’ని పేర్కొన్నారు.
“भारत के 3-4 सबसे अमीर लोगों का करोड़ों रूपये का कर्ज़ माफ़ हो जाता है, लेकिन हमारा क़र्ज़ माफ़ नहीं होता। हमने क्या गलती की है” – देश के किसान
यह कुछ ऐसे सवाल हैं जो आज देश के किसान पूछ रहे हैं।#CongressAaveChe pic.twitter.com/CfI7ubM1QT
— Congress (@INCIndia) November 21, 2022
కాగా, సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగతోంది. ఆయితే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ కొంత విరామం తీసుకున్నారు. జోడో యాత్ర మంగళవారం వరకు రెండు రోజుల విరామం తర్వాత మధ్యప్రదేశ్ నుంచి తిరిగి ప్రారంభమవుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..