Video: కన్నవారిని ఎదిరించి.. పారిపోయి పెళ్లి చేసుకుంది! కానీ, అంతలోనే..
శివ్పురిలోని 20 ఏళ్ల నైనా, చంద్రశేఖర్ అనే యువకుడు ప్రేమ వివాహం చేసుకుని ఇంటినుండి పారిపోయారు. ఆరు సంవత్సరాల ప్రేమాయణం తరువాత కుటుంబం వ్యతిరేకించడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. పారిపోయిన తరువాత, నైనా తన కుటుంబానికి ఒక వైరల్ వీడియో ద్వారా తమ నిర్ణయం గురించి తెలియజేసింది.
మధ్యప్రదేశ్లోని శివపురిలో గల ఖనియాధానా నివాసి బల్లు సాహు కుమార్తె 20 ఏళ్ల నైనా, అదే ప్రాంతానికి చెందిన బద్రీ ప్రసాద్ సేన్ కుమారుడు చంద్రశేఖర్ను ప్రేమ వివాహం చేసుకుంది. నైనా, చంద్రశేఖర్ ఆరు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు, కానీ నైనా కుటుంబం ఈ వివాహానికి ఒప్పుకోలేదు. దీంతో నైనా, చంద్రశేఖర్ శుక్రవారం ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిపోయారు. తమ కూతురు కనిపించడం లేదంటూ నైనా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఇంటర్నెట్ మీడియాలో ఒక వీడియో చాలా వైరల్ అయింది.
అది చూసి.. నైనా తల్లిదండ్రులకు గుండె ఆగినంత పనైంది. ఆ వీడియోను నైనా విడుదల చేసింది. చంద్రశేఖర్ను పెళ్లి చేసుకున్న తర్వాత.. తాను ఎందుకు ఇలా చేశానో వివరిస్తూ.. తన దృష్టిలో కుటుంబ సభ్యులు అందరూ చనిపోయినట్లే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. “నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, అందుకే ఇలా చేశాను. నా దృష్టిలో కుటుంబ సభ్యులు చనిపోయారు. వారి దృష్టిలో నేను చనిపోయాను అంతే. ఇక నా కోసం వెతకొద్దు. నేను ఇతనితో కలిసి బతకాలని అనుకుంటున్నాను. మమ్మల్ని వదిలేయండి.. మా బతుకు మేం బతుకుతాం.” అని పేర్కొంది. ఈ వీడియో కొద్ది క్షణాల్లోనే వైరల్గా మారింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్ను అభినందించాల్సిందే

ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్

గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?

వీడు బ్రాండెడ్ దొంగ.. వీడి బ్రాండ్ ఏమిటంటే? వీడియో

అల్లుడితో వెళ్లిపోయిన అత్త.. తిరిగి వచ్చింది కానీ వీడియో

కారుల్లో వస్తారు.. రెక్కీ నిర్వహిస్తారు ఆ తర్వాత వీడియో

యువకుడి ఐడియా అదుర్స్.. ఏసీ కూడా పనికి రాదు వీడియో
