AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా భర్తకు ఆ హోదా ఇవ్వండి చాలు..! పహల్గామ్‌ ఉగ్రదాడి బాధితురాలి డిమాండ్‌

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన కాన్పూర్ వ్యాపారవేత్త శుభమ్ ద్వివేదికి అమరవీరుడు హోదా ఇవ్వాలని ఆయన భార్య అశాన్య డిమాండ్ చేశారు. శుభమ్ హిందువు అని గర్వంగా చెప్పుకుని ప్రాణత్యాగం చేశారని ఆమె తెలిపారు. శుభమ్‌ తండ్రి భద్రతా లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నా భర్తకు ఆ హోదా ఇవ్వండి చాలు..! పహల్గామ్‌ ఉగ్రదాడి బాధితురాలి డిమాండ్‌
Shubham Dwivedi Wife
SN Pasha
|

Updated on: Apr 27, 2025 | 12:33 PM

Share

ఈ నెల 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌ ఉగ్రదాడిలో మొత్తం 26 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మరణించిన వారిలో కాన్పూర్‌కు చెందిన వ్యాపారవేత్త శుభమ్‌ ద్వివేది ఒకరు. అయితే.. తాజాగా ఆమె భార్య తన భర్తకు అమరవీరుడి హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలా అయితే నేను జీవించడానికి ఒక అర్థం ఉంటుందని ఆమె అన్నారు. ఇతరులను రక్షించడానికి తన ప్రాణాలను త్యాగం చేసినందుకు తన భర్తకు అమరవీరుడు హోదా ఇవ్వాలని కోరారు. ఆయన హిందువు అని గర్వంగా చెప్పుకొని మరీ ప్రాణ త్యాగం చేశారు అని మృతుడు శుభమ్‌ భార్య అశాన్య శనివారం వెల్లడించారు.

31 ఏళ్ల శుభం రెండు నెలల క్రితం అంటే ఫిబ్రవరి 12న అశాన్యను వివాహం చేసుకున్నారు. భార్యతో కలిసి కశ్మీర్‌ పర్యటనకు వెళ్లి ఏప్రిల్ 22న ఉగ్ర దాడిలో మరణించారు. గురువారం కాన్పూర్ సమీపంలోని అతని స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. కాగా దాడికి ముందు క్షణాలను గుర్తుచేసుకుంటూ మొదటి బుల్లెట్ నా భర్తను తాకింది. ఉగ్రవాదులు మేం హిందువులా లేదా ముస్లింలా అని అడిగారు. దాంతో చాలా మంది పరిగెత్తి తమ ప్రాణాలను కాపాడుకోగలిగారు అని అశాన్య చెప్పారు.

వారు మా దగ్గరకు వచ్చి మీరు హిందువులా? ముస్లింలా? అని అడిగారు. వారు తమాషా చేస్తున్నారని నేను అనుకున్నాను. నేను వెనక్కి తిరిగి, నవ్వి, ఏంటి అని అడిగాను, కానీ వారు మళ్ళీ అదే ప్రశ్నను అడిగారు. మేం హిందువులమని నేను సమాధానం చెప్పగానే, కాల్పులు జరిపారు. అంతే శుభమ్‌ ముఖం రక్తంతో తడిసిపోయింది. ఏమి జరిగిందో నాకు అర్థం కాలేదు అని అశాన్య భావోద్వేగానికి గురయ్యారు. ఈ దాడికి పాల్పడిన వారిని కాల్చి చంపాలని అశాన్య డిమాండ్‌ చేశారు. కాగా, శుభమ్‌ తండ్రి సంజయ్ ద్వివేది సంఘటన స్థలంలో భద్రత లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి జరిగిన దాదాపు గంట తర్వాత ఆర్మీ సిబ్బంది వచ్చి ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..